టైమ్స్ నౌ సర్వే: నిన్న కాంగ్రెస్ గెలిచిన మధ్యప్రదేశ్, రాజస్థాన్లలో బీజేపీ హవా, కర్ణాటకలో హోరాహోరీ
న్యూఢిల్లీ: ఇటీవల అసెంబ్లీ ఎన్నికలు జరిగిన రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలలో బీఎస్పీతో కలిసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఛత్తీస్గఢ్లో ఒంటరిగా విజయం సాధించింది. రాజస్థాన్, మధ్యప్రదేశ్లలో ఏ పార్టీకి మేజిక్ ఫిగర్ రాలేదు. బీజేపీ గట్టి పోటీ ఇచ్చింది. కానీ బీఎస్పీ మద్దతుతో కాంగ్రెస్ గెలిచింది.

మధ్యప్రదేశ్, రాజస్థాన్లలో బీజేపీ హవా, ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్
ఈ నేపథ్యంలో వచ్చే లోకసభ ఎన్నికల్లో ఈ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని యూపీఏ హవా ఉంటుందని అందరు భావిస్తున్నారు. కానీ రాహుల్ గాంధీకి ఊహించని షాక్ తగలనుంది. కేవలం ఛత్తీస్గఢ్లో మాత్రమే ఆ పార్టీకి ప్లస్ కానుంది. కానీ మధ్యప్రదేశ్, రాజస్థాన్లలో బీజేపీయే ఎక్కువ సీట్లు గెలుచుకోనుందని తాజాగా టైమ్స్ నౌ ప్రీపోల్ సర్వే ఫలితాలు వెల్లడిస్తున్నాయి.

ఏ రాష్ట్రంలో ఎన్ని సీట్లు అంటే
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో 29 లోకసభ స్థానాలు ఉన్నాయి. సర్వే ప్రకారం... ఇక్కడ కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ కేవలం 6 సీట్లు మాత్రమే గెలుచుకోనుంది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే 23 సీట్లు గెలుచుకోనుంది. రాజస్థాన్లో 25 లోకసభ స్థానాలకు గాను యూపీఏ 8, ఎన్డీయే 17 సీట్లు గెలుచుకోనుంది. ఛత్తీస్గఢ్లో మాత్రం యూపీఏ 6, ఎన్డీయే 5 సీట్లు గెలుచుకోనుందని తేలింది. మొత్తంగా ఈ మూడు రాష్ట్రాల నుంచి ఎన్డీయే 45 సీట్లు గెలుచుకుంటుండగా, కాంగ్రెస్ 20 సీట్లు మాత్రమే గెలవనుంది. అధికారంలో ఉన్న కర్ణాటకలోను బీజేపీ.. కాంగ్రెస్తో పోటీ పడుతోంది. చెరీ 14 సీట్లు గెలుచుకోనున్నారు.

బీజేపీపై వ్యతిరేకత కాదా
ఈ ఫలితాలను బట్టి రాజస్థాన్, మధ్యప్రదేశ్లలో వరుసగా మూడుసార్లు బీజేపీ అధికారంలో ఉండటం వల్ల ఓడిపోయిందని అర్థమవుతోందని అంటున్నారు. కానీ శివరాజ్ సింగ్ చౌహాన్ లేదా నరేంద్ర మోడీలపై వ్యతిరేకత కాదని అర్థమవుతోందని అంటున్నారు.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications