22 మంది ప్రాణం తీసిన పౌర్ణమి పూజలు, చెరువులోకి ట్రాక్టర్ పల్టీ, సీసీటీవీ కెమెరాల్లో !
గ్రామంలో నివాసం ఉంటున్న చాలా మంది వారి కుటుంబ సమేతంగా గంగానదిలో స్నానమాచరించి దేవుడి దర్శనానికి బయలుదేరిన భక్తులతో వెళ్తున్న ట్రాక్టర్ ప్రమాదానికి గురైంది. ఉత్తరప్రదేశ్లోని కదర్గంజ్కు వెళ్తుండగా ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడింది. ఆ ప్రమాదంలో ట్రాక్టర్ చెరువులో పడింది. ఈ ప్రమాదంలో చిన్నారులు, మహిళలతో సహా 22 మంది చనిపోయారు.
పలువురు గాయపడటంతో వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ట్రాక్టర్లో భక్తులను ఎక్కించుకుని కదర్గంజ్ క్షేత్రానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పెద్ద సంఖ్యలో భక్తులను ట్రాక్టర్లో ఎక్కించారు. దీంతో ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య పెరిగిందని అధికారులు అంటున్నారు. వేగంగా వెలుతున్న ట్రాక్టర్ అదుపు తప్పి ఒక్కసారిగా బోల్తా పడింది. తర్వాత ట్రాకర్ చెరువులోకి పడిపోయింది. ఈ ప్రమాదంలో 22 మంది భక్తులు మృతి చెందారని అధికారులు చెప్పారని స్థానిక మీడియా తెలిపింది.

సమాచారం అందుకున్న ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్థానిక జిల్లా కలెక్టర్కు ఫోన్ చేసి క్షతగాత్రులకు సరైన చికిత్స అందించాలని ఆదేశించారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు సీఎం యోగి ఆదిత్యనాథ్ ఒక్కొక్కరికి రూ. 2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. గాయపడిన వారికి రూ.50,000 పరిహారం ప్రకటించారు. కసగంజ్ జిల్లాలో జరిగిన ప్రమాదం గురించి తెలియడం బాధాకరం అని సీఎం యోగి ఆదిత్యనాథ్ విచారం వ్యక్తం చేశారు.
మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి, క్షతగాత్రులకు సరైన వైద్యం అందించాలని జిల్లా కలెక్టర్ను ఆదేశించామని, మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నానని, క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని శ్రీరాముడిని ప్రార్థిస్తున్నట్లు యోగి ఆదిత్యనాథ్ ట్వీట్ చేశారు.
బోల్తాపడిన ట్రాక్టర్ నేరుగా పెద్ద చెరువులో పడిపోయింది. తీవ్రంగా గాయపడిన పలువురిని చెరువులో నుంచి బయటకు తీసి వారిని రక్షించడానికి ప్రయత్నించక ముందే చనిపోయారని స్థానిక మీడియా తెలిపింది.

-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications