పెళ్లి పేరుతో మోసం: యువతిపై 2 నెలలపాటు రేప్
జైపూర్: పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ ప్రబుద్ధుడు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఈ ఘటన రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్లో చోటు చేసుకుంది.
బాధిత యువతి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం వివరాలిలా ఉన్నాయి. అనిల్ మీనా అనే యువకుడు సదరు యువతిని వివాహం చేసుకుంటానని నమ్మించాడు. ఆ తర్వాత ఆమెపై రెండు నెలలపాటు అత్యాచారానికి పాల్పడ్డాడు.
వివాహం చేసుకోవాలని యువతి అతనిపై ఒత్తిడి తేవడంతో అనిల్ మీనా ఆమెను దూరం పెట్టడం ప్రారంభించాడు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, నిందితుడి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.
65 కోట్లు విలువైన కొకైన్ స్వాధీనం
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో భారీగా కొకైన్ పట్టుబడింది. ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో రూ.65 కోట్లు విలువైన కొకైన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 1.3 కిలోల కొకైన్ని అక్రమంగా రవాణా చేస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.