నోయిడాలో టెక్కీ దారుణహత్య, బోయ్ ఫ్రెండ్ పైనే అనుమానాలు?
23 ఏళ్ళ సాఫ్ట్ వేర్ ఉద్యోగిని ఓకరుదారుణ హత్యకు బుదవారం నాడు గురైంది. నోయిడాలోని శతాబ్ది రైల్ విహార్ సోసైటీలో(సెక్టార్ 62) లో ఈ ఘటన చోటుచేసుకొంది.
న్యూఢిల్లీ: 23 ఏళ్ళ సాఫ్ట్ వేర్ ఉద్యోగిని ఓకరుదారుణ హత్యకు బుదవారం నాడు గురైంది. నోయిడాలోని శతాబ్ది రైల్ విహార్ సోసైటీలో(సెక్టార్ 62) లో ఈ ఘటన చోటుచేసుకొంది.
లవ్లీ ఫ్రొఫెషన్ యూనివర్శిటీకి చెందిన అంజలీ రాథోర్ సెక్టార్ 62 లో లావా కంపెనీలో పనిచేస్తోంది. ఆమె బోయ్ ప్రెండ్ ఈ హత్యకు పాల్పడి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.
సోసైటీ పార్కింగ్ ఏరియాలోనే ఆమె మృతదేహాన్ని కనుగొన్నారు. వెంటనే ఫోర్టిన్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆమె మరణించినట్టు వైద్యులు నిర్ధారించారు.
హర్యానాలోని యమునా నగర్ కు చెందిన రాథోర్ 2016 లో ఉద్యోగంలో చేరింది. ఆమె థర్డ్ ఫ్లోర్ లో మరో ఆరుగురు అమ్మాయిలతో కలిసి ఉంటోంది. బాయ్ ఫ్రెండ్ అనుమానిస్తున్న ఒక వ్యక్తి నుండి ఫోన్ రావడంతో ఆమె తలుపుతెరిచి గ్రౌండ్ ఫ్లోర్ కు వచ్చింది.
అక్కడే ఆమెను తుపాకీతో కాల్చిచంపారు. పార్కింగ్ ఏరియాలోని సీసీటీవి కెమెరాల్లో ఈ దృశ్యాలు రికార్డయ్యాయి.అదే క్యాంపస్ లో ఉండే అమ్మాయి ఉదయంపూట ట్యూషన్ వెళ్తుండగా రూమ్మేట్స్ కు సమాచారమిచ్చింది.
ఆమెను ఆసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయిందని వైద్యులు నిర్ధారించారు.ప్రాథమిక దర్యాప్తు మేరకు బోయ్ ఫ్రెండ్ ఆమెను కాల్చిచంపినట్టు పోలీసులు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. నిందితుడిని త్వరలోనే పట్టుకొంటామన్నారు.