అటవీ ప్రాంతానికి వెళ్లిన 25ఏళ్ల వివాహితపై గ్యాంగ్ రేప్
న్యూఢిల్లీ: ఉత్తర ప్రదేశ్లోని ముజఫర్నగర్లో దారుణం జరిగింది. స్నేహితురాలితో కలిసి ఇంటి సమీపంలోని అటవీ ప్రాంతానికి వెళ్లిన వివాహితపై ఇద్దరు యువకులు దాడి చేసి అనంతరం.. సామూహిక అత్యాచారం చేసిన ఘటన ఉత్తరప్రదేశ్లో జరిగింది.
పోలీసులు తెలిపిన కథనం ప్రకారం నిందితులు బమన్ హెరీ గ్రామానికి చెందిన ఉత్తమ్ చంద్, బావర్ సింగ్గా గుర్తించి.. అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. అత్యాచారం చేసిన వెంటనే యువకులు అక్కడి నుంచి పరారవ్వడంతో ... బాధితురాలు సివిల్ లైన్స్ పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి వయసు 25 సంవత్సరాలని పోలీసులు వెల్లడించారు.

నిందితులపై పలు సెక్షన్ల క్రింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు చెప్పారు. బాధితురాలిని వైద్య పరీక్షల కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించామన్నారు. బాధితురాలికి వివాహమైందని ఆమెకు ఒక చిన్నారి కూడా ఉందని పోలీసులు వెల్లడించారు.
ఐతే అడవికి వెళ్లిన స్నేహితురాలిని అక్కచ నుంచి వెళ్లి పోవాలని బెదిరించారని చెప్పారు. దీంతో ఆమె స్నేహితురాలు భయపడి అక్కడి నుంచి వెళ్లిపోయిందని పోలీసులు తెలిపారు. అత్యాచారం చేసే క్రమంలో ప్రతిఘటించిన యువతిపై ఇద్దరు యువకులను దాడి చేసి తీవ్రంగా గాయపరిచారని పోలీసులు వెల్లడించారు.
-
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !!












Click it and Unblock the Notifications