ఇంకా రిసార్టులోనే మంత్రులు, ఎమ్మెల్యేల మకాం.. 25మందికి అస్వస్థత
రిసార్టులో ఉన్న ఎమ్మెల్యేల్లో పలువురు ఎమ్మెల్యేలు అనారోగ్యంతో అస్వస్థతకు గురైనట్టు నిన్నటి నుంచి వార్తలు వస్తున్నాయి.
చెన్నై: పన్నీర్ తిరుగుబాటు బావుటా ఎగరేయడంతో ఎమ్మెల్యేలు పట్టు జారిపోకుండా చూసుకోవడం కోసం అన్నాడీఎంకె ప్రధాన కార్యదర్శి వేసిన ఎత్తుగడ 'గోల్డెన్ బే రిసార్టు'. గడిచిన వారం రోజులకు పైగా తమిళనాడు పాలిటిక్స్ అన్ని ఈ రిసార్టు చుట్టూనే తిరుగుతూ వచ్చాయి.
చివరాఖరికి సుప్రీం తీర్పుతో శశికళ భంగపడ్డా.. శాసనసభాపక్ష నేతగా పళనిస్వామిని ఎంపిక చేసి ఎమ్మెల్యేలను పార్టీకి అంటిపెట్టి ఉంచడంలో సఫలమయ్యారు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు గోల్డెన్ బే రిసార్టులోనే ఉన్న పరిస్థితి. సుప్రీం తీర్పు అనంతరం రిసార్టులోని ఎమ్మెల్యేలను, మంత్రులను పోలీసులు తరలించాలని ప్రయత్నించినా.. అందుకు వారు తిరస్కరించారు.

కాగా, రిసార్టులో ఉన్న ఎమ్మెల్యేల్లో పలువురు ఎమ్మెల్యేలు అనారోగ్యంతో అస్వస్థతకు గురైనట్టు నిన్నటి నుంచి వార్తలు వస్తున్నాయి. వేళకు మందులు వేసుకోకపోవడం, సరైన వ్యాయామం లేకపోవడం, ఇతరత్రా కారణాలతో 25మందికి పైగా శాసనసభ్యులు అస్వస్థతకు గురైనట్టు సమాచారం.
బుధవారం నాడు వారు రిసార్టు నుంచి బయటకు వచ్చే అవకాశం ఉన్నట్టుగా చెబుతున్నారు. బలనిరూపణపై నేడు గవర్నర్ విద్యాసాగర్ రావు నిర్ణయం తీసుకునే అవకాశం ఉండటంతో.. ఆయన నిర్ణయం వెలువడిన వెంటనే వారు బయటకొచ్చే అవకాశం ఉంది.
-
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!!












Click it and Unblock the Notifications