కేరళలో ఆరెస్సెస్ కార్యకర్త దారుణ హత్య, నరికి చంపిన దుండగులు
కన్నూర్: 26 ఏళ్ల ఆరెస్సెస్ (రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్) కార్యకర్త ఒకరు దారుణ హత్యకు గురయ్యారు. ఈ సంఘటన కేరళలోని కన్నూరులో జరిగింది. కొందరు దుండగులు ఆ కార్యకర్తను దారుణంగా చంపేశారు.
ముసుగు ధరించిన కొందరు దుండగులు శుక్రవారం దారుణంగా నరికి చంపారు. 26 ఏళ్ల శ్యాంప్రసాద్పై నల్లకారులో వచ్చిన ముసుగు మనుషులు పదునైన ఆయుధాలతో దాడి చేసినట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. సమీపంలోని ఓ ఇంటిలోకి వెళ్లి తలదాచుకునేందుకు శ్యాంప్రసాద్ ప్రయత్నించినప్పటికీ బయటకు లాక్కొచ్చి అక్కడికక్కడే ఆయన నరికి చంపినట్టు చెప్పారు.

స్థానికులు అక్కడకు చేరుకుని అతన్ని ఆసుపత్రికి తరలించే లోపే కన్నుమూసినట్టు చెబుతున్నారు. కాగా, ఇది రాజకీయ హింసగా అనుమానిస్తున్నామని, అయితే ప్రధాన కారణం ఏమిటనే విషయమై దర్యాప్తు జరుపుతున్నామని జిల్లా పోలీసు అధికారులు తెలిపారు.
More From
-
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
దేవాన్ష్ పేరిట తిరుమలలో ఆ రోజు ఖర్చు మొత్తం చంద్రబాబుదే, స్వయంగా..!! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
సీఎం తొలి సంతకం.. పేదల కోసం వరాల ఉగాది! -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
Dhurandhar 2 Review:"భాయ్" తేల్చేశాడు భయ్యా...బన్నీ ఫ్యాన్స్ గెట్ రెడీ..!! -
Today Rasi Phalalu March 19th: ఉగాది రోజున ఎవరికి యోగం?ఎవరికి హెచ్చరిక?మీ రాశి ఫలం ఇక్కడే! -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
సీఎం రేవంత్ రెడ్డి జాతకం చూశారా? ఇక ప్రత్యర్థులకు చుక్కలే! -
30 ఏళ్లలో ఎన్నడూ లేనంత చిన్నదిగా.. 2060 నాటికి ఓజోన్ పొర.. -
ట్రంప్ చెప్పినా వినని పావెల్! వడ్డీ రేట్ల యథాతథం!












Click it and Unblock the Notifications