ఇండో-మయన్మార్ బార్డర్: అంబుష్ పేల్చడంతో ముగ్గురు జవాన్లు మృతి, ఐదుగురికి గాయాలు
ఇంఫాల్: మణిపూర్ రాష్ట్రంలోని భారత్-మయన్మార్ దేశాలకు సరిహద్దుగా ఉన్న ఛందేల్ జిల్లాలో అనుమానిత పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్ఏ) మిలిటెంట్లు పేల్చిన అంబుష్ ఘటనలో ముగ్గురు అస్సామ్ రైఫిల్స్ జవాన్లు మరణించారు. మరో ఐదుగురు గాయాలపాలయ్యారు. బుధవారం రాత్రి ఈ ఘటన జరిగింది.
ఇండో-మయన్మార్ సరిహద్దు ప్రాంతానికి మూడు కిలోమీటర్ల దూరంలోని ఖోంగ్టల్ వద్ద పహారా కాస్తున్న సమయంలో బుధవారం రాత్రి 8.30 గంటలకు ఈ ఘటన చోటు చేసుకుంది. జవాన్లు అంతర్జాతీయ సరిహద్దులో విధుల నిర్వహించి వస్తున్న సమయంలో మిలిటెంట్లు ఈ ఘాతుకానికి తెగబడ్డారని అధికారులు తెలిపారు.

బేస్ క్యాంపునకు రెండు కిలోమీటర్ల దూరంలోని సాజిక్ టాంపక్ గ్రామం వద్దకు రాగానే ఐఈడీ పేలుడు సంభవించింది. ఈ పేలుడుతో హవిల్దార్ ప్రణయ్ కలిట, రైఫిల్ మ్యాన్ వైఎం కోన్యక్, రైఫిల్ మ్యాన్ రతన్ సలీమ్ మృతి చెందారు. గాయపడిన మరో ఐదుగురు జవాన్లను మిలిటరీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Recommended Video
ఈ దాడికి పాల్పడింది తామేనంటూ ఇప్పటి వరకు ఏ మిలిటెంట్ సంస్థా ప్రకటించలేదు. అయితే, ఈ పని చేసింది పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్ఏ)పై అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీనిపై అస్సామ్ రైఫిల్స్ అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
-
వేసవిలో వాకింగ్ ఎవరికి ఏ సమయంలో మంచిది- ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!! -
92 వేల టన్నుల LPGతో భారత్ కు రెండు నౌకలు.. హర్మూజ్ జలసంధి గుండా.. -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్












Click it and Unblock the Notifications