Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఇండో-మయన్మార్ బార్డర్: అంబుష్ పేల్చడంతో ముగ్గురు జవాన్లు మృతి, ఐదుగురికి గాయాలు

ఇంఫాల్: మణిపూర్ రాష్ట్రంలోని భారత్-మయన్మార్ దేశాలకు సరిహద్దుగా ఉన్న ఛందేల్ జిల్లాలో అనుమానిత పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్ఏ) మిలిటెంట్లు పేల్చిన అంబుష్ ఘటనలో ముగ్గురు అస్సామ్ రైఫిల్స్ జవాన్లు మరణించారు. మరో ఐదుగురు గాయాలపాలయ్యారు. బుధవారం రాత్రి ఈ ఘటన జరిగింది.

ఇండో-మయన్మార్ సరిహద్దు ప్రాంతానికి మూడు కిలోమీటర్ల దూరంలోని ఖోంగ్టల్ వద్ద పహారా కాస్తున్న సమయంలో బుధవారం రాత్రి 8.30 గంటలకు ఈ ఘటన చోటు చేసుకుంది. జవాన్లు అంతర్జాతీయ సరిహద్దులో విధుల నిర్వహించి వస్తున్న సమయంలో మిలిటెంట్లు ఈ ఘాతుకానికి తెగబడ్డారని అధికారులు తెలిపారు.

3 Assam Rifles Personnel Killed, 5 Injured in Ambush along India-Myanmar Border

బేస్ క్యాంపునకు రెండు కిలోమీటర్ల దూరంలోని సాజిక్ టాంపక్ గ్రామం వద్దకు రాగానే ఐఈడీ పేలుడు సంభవించింది. ఈ పేలుడుతో హవిల్దార్ ప్రణయ్ కలిట, రైఫిల్ మ్యాన్ వైఎం కోన్యక్, రైఫిల్ మ్యాన్ రతన్ సలీమ్ మృతి చెందారు. గాయపడిన మరో ఐదుగురు జవాన్లను మిలిటరీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Recommended Video

    New National Education Policy 2020: 5+3+3+4 System, New Exams Pattern || Oneindia Telugu

    ఈ దాడికి పాల్పడింది తామేనంటూ ఇప్పటి వరకు ఏ మిలిటెంట్ సంస్థా ప్రకటించలేదు. అయితే, ఈ పని చేసింది పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్ఏ)పై అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీనిపై అస్సామ్ రైఫిల్స్ అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+