ముండే, మహాజన్ ఫ్యామిలీకి మూడంకే ముప్పు?
న్యూఢిల్లీ: దివంగత నేతలు గోపీనాత్ ముండే, ప్రమోద్ మహాజన్ కుటుంబాలకు మూడో నంబర్ అంకె ఏ మాత్రం అచ్చిరావడం లేదనే అంచనాలు సాగుతున్నాయి. కాకతాళీయమే అయినా ఆ రెండు కుటుంబాల్లో చోటుచేసుకున్న ప్రమోద్ మహాజన్, ఆయన సోదరుడు ప్రవీణ్ మహాజన్, గోపీనాథ్ ముండే మరణాల్లో ఈ అంకె కనిపిస్తోంది. దీంతో ఆ ప్రచారం సాగుతోంది.
గతంలో బిజెపి సీనియర్ నేతగా, కేంద్ర మంత్రిగా అతి కొద్ది కాలంలోనే మంచి గుర్తింపు పొందిన నేత ప్రమోద్ మహాజన్. తన సోదరుడు ప్రవీణ్ మహాజన్ జరిపిన కాల్పుల్లో ఆయన 2006 మే 3వ తేదీన మృతిచెందారు. పాయింట్ 32 లెసైన్డ్ తుపాకీతో ప్రమోద్పై ప్రవీణ్ నాలుగుసార్లు కాల్పులు జరుపగా అందులో మూడు తూటాలు ప్రమోద్ శరీరంలోకి దూసుకెళ్లడంతో ఆయన 13 రోజుల పోటు మృత్యువుతో పోరాటం చేసి కన్నుమూశారు.

సోదరుడిని కాల్చి చంపిన కేసులో జీవితఖైదు అనుభవిస్తూ వచ్చిన ప్రవీణ్ మహాజన్ 2010 మార్చి 3వ తేదీన బ్రెయిన్ హేమరేజ్కు చికిత్స పొందుతూ థానే ఆస్పత్రిలో కన్నుమూశారు. ఇపుడు ఢిల్లీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కేంద్ర మంత్రి గోపీనాథ్ ముండే 2014 జూన్ 3వ తేదీ మృత్యువాతపడ్డారు.
అంతేకాకుడా, ప్రమోద్ మహాజన్ మృతి చెందిన నెలకు ఆయన వద్ద వ్యక్తిగత సహాయకుడిగా పని చేసిన వివేక్ మోయిత్రా ఢిల్లీలోని అధికార బంగ్లాలో 2006 జూన్ 3వ తేదీనే అనుమానాస్పద రీతిలో మరణించారు.
-
బెంగాల్ టైగర్ ఎవరో తేల్చేసిన సర్వేలు.. దీదీ మళ్లీ సీఎం అవుతారా? -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565












Click it and Unblock the Notifications