ఇద్దరు కవలల్ని ఇంట్లోకి పిలిచిన కోడలు, రేప్ చేసిన 50 ఏళ్ల మామ!
ముజఫర్ నగర్: ఉత్తర ప్రదేశ్లోని ముజఫర్ నగర్లో దారుణం జరిగింది. ఇద్దరు మూడేళ్ల చిన్నారులను ఓ కోడలు పిలవగా, ఆమె మామ అత్యాచారం చేసినట్లుగా తెలుస్తోంది. ఆ మూడేళ్ల పిల్లలు కవలలు. ఇది మీర్పూర్లో జరిగింది. చిన్నారులు చెప్పిన సమాచారంతో తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు.
మూడేళ్ల ఆ కవలలు తమ ఇంటి బయట ఆడుకుంటున్నారు. ఆ సమయంలో పక్కంటిలో ఉన్న ఓ కోడలు వారిని తన ఇంటికి పిలిచింది. అయితే, ఆ ఇంట్లో ఉన్న యాభై ఏళ్ల వ్యక్తి (ఆమె మామ) వారి పైన అత్యాచారం చేసినట్లుగా తెలుస్తోంది.

తర్వాత వారు ఇంటికి తిరిగి వచ్చారు. ఆ పిల్లలు జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పారు. వారు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు చిన్నారులను పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. నిందితుడిని అరెస్టు చేశారు.
ఈ సంఘటన సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో జరిగింది. పక్కింట్లో ఉండే కోడలు వారిని ఇంటిలోకి తీసుకు వెళ్లిందని, ఆ సమయంలో అత్యాచారం జరిగినట్లుగా తెలుస్తోందని పోలీసులు చెప్పారు. పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిందితుడు ఈ ఘాతుకానికి పాల్పడిన సమయంలో తాగి ఉన్నాడు. కాగా, ఇందులో కోడలు పాత్ర ఏమైనా ఉందా అని పోలీసులు ఆరా తీస్తున్నారు.












Click it and Unblock the Notifications