దేశంలో ఈసారి వర్షాలు అనుకున్నంత స్థాయిలో కురవవు: వాతావరణశాఖ
దేశవ్యాప్తంగా రుతుపవనాలు ప్రవేశించి ఇప్పటికే ఒక నెల పూర్తయినప్పటికి కూడా... ఇంకా ఆశించిన స్థాయిలో వర్షాలు కురవలేదని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు. అయితే ఇంకా మూడు నెలల సమయం ఉన్నందును ఇప్పుడే దీనిగురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు.
రుతుపవనాలు దేశవ్యాప్తంగా అనుకున్న సమయానికంటే 15 రోజులు ముందే ఎంట్రీ ఇచ్చాయి. కానీ వర్షాలు మాత్రం అనుకున్న దానికంటే 4శాతం తక్కువే కురిసినట్లు వెదర డిపార్ట్మెంట్ చెబుతోంది. ఇప్పటికీ రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించి నెలరోజులు కావొస్తోందని, ఈ సారి వర్షాలు సాధారణ స్థాయిలోనే ఉంటాయనే భావన కలుగుతోందని అన్నారు పుణేలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మీటియరాలజీ శాఖ డైరెక్టర్ డాక్టర్ రవినంజున్దయ. వర్షాలు తక్కువ స్థాయిలో కురిసినప్పటికీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు.

అయితే వర్షాలు పడకపోవడానికి కారణం ఏమిటో తెలుసుకునే పనిలో పడ్డారు వాతావరణశాఖ అధికారులు. ఇందుకోసం ప్రతిరోజు వాతావరణంలోకి బెలూన్లను పంపించి ఏ రోజుకారోజు రిపోర్ట్ను స్టడీ చేస్తున్నారు. ఇప్పటికే దేశంలో మూడో వంతు ప్రాంతాల్లో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవలేదు. ఇప్పటికే గంగా నది ప్రవహించే ప్రాంతంలో వర్షాలు కురవక అక్కడి రైతులు కాస్త ఇబ్బందులు పడుతున్నారు. ఇది వచ్చే ఎన్నికల్లో ఓటరుగా ఉన్న రైతుపై ప్రభావం చూపి ప్రభుత్వంకు కాస్త ఇబ్బందిగా మారే సూచనలు కనిపిస్తున్నాయి.
వాతావరణ శాఖ అందించిన గణాంకాలు ప్రకారం చూస్తే... దేశం మొత్తం మీద వర్షాల్లో 4శాతం తగ్గుదల కనిపిస్తోంది. తూర్పు ఈశాన్య భారతంలో 26శాతం తగ్గుదల ఉండగా, మధ్యభారత్ ప్రాంతాల్లో ఒక శాతం తక్కువగా వర్షాలు కురిశాయి. వాయువ్య భారత దేశంలో వర్షాలు 12శాతం అధికంగానే కురవగా...దక్షిణ భారత దేశంలో 20శాతం అధిక వర్షపాతం నమోదైనట్లు గణాంకాలు వెల్లడించాయి.
-
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!!












Click it and Unblock the Notifications