వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
షాక్: తల్లిని చంపి తల పట్టుకుని పోలీస్ స్టేషన్కు చేరిన వ్యక్తి
చెన్నై: తమిళనాడులో దిగ్భ్రాంతికరమైన సంఘటన చోటు చేసుకుంది. ఓ 30 ఏళ్ల వ్యక్తి తన తల్లిని హత్య చేశాడు. ఆ తర్వాత ఆమె తలను పట్టుకుని పోలీసు స్టేషన్లో లొంగిపోయాడు. అతన్ని చూసి పోలీసులే షాక్ తిన్నారు.
ఆదివారంనాడు ఆ సంఘటన చోటు చేసుకుంంది. ఆస్తుల విషయంలో అతను తన తల్లి రాణితో తరుచుగా గొడవ పడుతూ ఉండేవాడు. ఆదివారం ఉదయం ఇంట్లో ఇరువురి మధ్య గొడవ జరిగింది.
ఆ సమయంలో అతను పదునైన ఆయుధంతో తల్లి తలను నరికాడు. ఆ తర్వాత తలను పట్టుకుని కరంబకూడి పోలీసు స్టేషన్కు వెళ్లి పోలీసులకు లొంగిపోయాడు.
మృతురాలు పదేళ్ల క్రితం తన భర్త కేసులో నిందితురాలు. అయితే ఆ కేసు నుంచి ఆమె నిర్దోషిగా బయటపడింది. తల్లిని చంపిన ఆనంద్ను పోలీసులు అరెస్టు చేశారు.
Comments
English summary
A 30-year-old man sent the personnel of a police station in the district into a tizzy when he walked in with the "severed head" of his mother after allegedly killing her on Sunday, police said.
Story first published: Monday, March 19, 2018, 9:26 [IST]