ఎక్స్ ప్రెస్ రైలులో మహిళను రేప్ చేసిన ఉద్యోగి, అరిస్తే బయటకు తోసేస్తా, ఆ గదిలో !
ఎక్స్ ప్రెస్ రైలులో సీటు ఇప్పిస్తానని మహిళ మీద అత్యాచారం చేసిన దారుణం ఘటన బాంద్రా-జైపూర్ అరవాళి ఎక్స్ ప్రెస్ రైలులో జరిగింది.
జైపూర్/సూరత్: ఎక్స్ ప్రెస్ రైలులో సీటు ఇప్పిస్తానని మహిళ మీద అత్యాచారం చేసిన దారుణం ఘటన బాంద్రా-జైపూర్ అరవాళి ఎక్స్ ప్రెస్ రైలులో జరిగింది. 32 ఏళ్ల మహిళ మీద అత్యాచారం చేసిన కామాంధుడిని జైపూర్ రైల్వే పోలీసులు అరెస్టు చేశారు.
వేగంగా వెలుతున్న ఎక్స్ ప్రెస్ రైలులోనే మహిళ మీద అత్యాచారం చేసిన రైల్వే ఉద్యోగి అజహర్ ఖాన్ అనే కామాంధుడిని బెండ్ తీస్తున్నారు. విషయం బయటకు చెబితే నీ ప్రాణాలు తీస్తానని, రైలులో నుంచి కిందకు తోసేస్తానని బాధితురాలిని నిందితుడు బెదిరించాడని రైల్వే పోలీసుల ప్రాథమిక విచారణలో వెలుగు చూసింది.

స్నేహితురాలితో కలిసి !
ఘాజియాబాద్ కు చెందిన 32 వివాహిత మహిళ స్నేహితురాలితో కలిసి బాంద్రా-జైపూర్ అరవాళి ఎక్స్ ప్రెస్ రైలులో జైపూర్ చేరుకోవడానికి బయలుదేరింది. తరువాత ఓ ప్రైవేట్ ట్యాక్సీలో ఆమె రైల్వే స్టేషన్ చేరుకునింది.

ఒక్క సీటు కావాలి!
32 ఏళ్ల మహిళ, ఆమె స్నేహితురాలు రైలులో ప్రయాణించడానికి సిద్దం అయ్యారు. అయితే ఒక్క సీటు మాత్రమే వారికి చిక్కింది. మరో సీటు కావాలని చూస్తున్నారు. అయితే రైలులో రద్దీ విపరీతంగా ఉండటంతో వారు చాల ఇబ్బంది పడ్డారు.

రైలులో హంగామా !
బాందా-జైపూర్ అరివాళి ఎక్స్ ప్రెస్ రైలులో నిలబడి వెలుతున్న సమయంలో అటు వైపు క్యాటరింగ్ చేసే ఉద్యోగి అజహర్ ఖాన్ అనే వ్యక్తి అటు వైపు వచ్చాడు. ఆ సందర్బంలో ఆమె సర్ ఒక్క సీటు సర్దిపెట్టండి. చాల ఇబ్బంది పడుతున్నాం అంటూ ఆ మహిళ అతనికి మనవి చేసింది.

టీసీతో మాట్లాడాతుతా !
ఓస్ అంతేనా, ఇక ఈ విషయం నాకు వదిలేయండి అంటూ అజహర్ ఖాన్ ఆమెకు చెప్పాడు. ఆ సమయంలో అజహర్ ఖాన్ అటూ ఇటూ తిరుగుతూ నానా హంగామా చేశాడు. అతని హంగామా చూస్తూంటే నిజంగా తనకు సీటు చిక్కేటట్లు ఉందని ఆమె భ్రమపడిపోయింది.

కదులుతున్న రైలులోనే !
రైలు వేగంగా వెలుతుతన్న సమయంలో అజహర్ ఖాన్ 32 ఏళ్ల మహిళకు ఫోన్ చేశాడు. సీటు చిక్కింది రావాలని చెప్పాడు. అతని దగ్గరకు వెళ్లిన తరువాత కామాంధుడు ఆమెను క్యాటరింగ్ సామాగ్రి ఉండే చిన్నగదిలోకి లాక్కెళ్లాడు. తరువాత ఆమె మీద అత్యాచారం చేశాడు. కేకలు వేసినా విషయం బయటకు చెప్పినా రైలులో నుంచి కిందకు తోసేస్తానని నీ ప్రాణాలు పోతాయని ఆమెను హెచ్చరించాడు.

రైల్వే పోలీసులు !
మహిళ మీద అత్యాచారం చేసిన కామాంధుడు చిన్నగా జారుకున్నాడు. కదులుతున్న రైలులో అతని మీ ఫిర్యాదు చేస్తే ప్రాణాలకు ముప్పు అంటూ ఆమె భయపడింది. రైలు జైపూర్ రైల్వే స్టేషన్ చేరుకోగానే బాధితురాలు రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలు ఇచ్చిన సమాచారం మేరకు రైల్వే పోలీసులు అజహర్ ఖాన్ ను అరెస్టు చేశారు.

కేసు సూరత్ కు !
మహిళ మీద అత్యాచారం జరిగిన సమయంలో రైలు సూరత్-భారుచ మార్గం మద్యలో ఉందని అధికారులు గుర్తించారు. కేసు నమోదు చేసిన జైపూర్ పోలీసులు కేసును సూరత్ రైల్వే పోలీసులకు బదిలి చేశారు. కామాంధుడు అజహర్ ఖాన్ ఇంకా ఎంత మంది రైలు ప్రయాణికులను ఇలా అత్యాచారం చేశాడు అంటూ రైల్వే పోలీసులు విచారణ చేస్తున్నారు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications