ఇంటి అద్దె కట్టని మహిళ: రెండేళ్లుగా యజమాని రేప్, ఫిర్యాదు
ఫరీదాబాద్: 38 ఏళ్ల మహిళ పైన ఓ ఇంటి యజమాని గత కొన్ని రోజులుగా పలుమార్లు అత్యాచారానికి పాల్పడిన సంఘటన ఉత్తర ప్రదేశ్లోని ఫరీదాబాదులో జరిగింది. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె గ్రీన్ ఫీల్డ్స్ కాలనీకి చెందినవారు.
ఆమె శనివారం తమకు ఫిర్యాదు చేశారని, సునీల్ అనే వ్యక్త తన పైన గత కొన్ని రోజులుగా పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారని ఆమె చెప్పారని పోలీసులు చెప్పారు. బాధిత మహిళ సునీల్ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు.
ఆమె గత పదేళ్లుగా సునీల్ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆమె గత రెండేళ్లుగా అద్దె చెల్లించడం లేదు. దీనిని సాకుగా చేసుకొని సునీల్.. పదేపదే ఇంటి అద్దె కోసమని ఆమె గదికి వెళ్లేవాడు. రెండేళ్ల క్రితమే అతను ఆమె పైన అత్యాచారానికి పాల్పడ్డాడు.
దీంతో ఆమె కొద్ది రోజుల క్రితం మరో ఇంటికి మారింది. ఆయన ఈ ఏడాది మార్చి 18వ తేదీన మరోసారి ఆమె వద్దకు వెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయాలని నిర్ణయించింది. సూరజ్ కుండ్ పోలీసులు కేసు నమోదు చేశారు.