కశ్మీర్ ఉగ్రవాదులతో ఎన్ కౌంటర్- ఇద్దరు కెప్టెన్ల సహా నలుగురు సైనికుల వీరమరణం..
జమ్మూ కశ్మీర్లోని రాజౌరీ జిల్లాలో ఇవాళ ఉగ్రవాదులతో జరుగుతున్న ఎన్ కౌంటర్ లో ఇప్పటివరకూ నలుగురు సైనికులు వీరమరణం పొందారు. ఇందులో ఇద్దరు కెప్టెన్లు కూడా ఉన్నారు. ఇంకా ఎన్ కౌంటర్ కొనసాగుతోంది. ఇది పూర్తయితే కానీ ఇంకా ఎంతమంది చనిపోయారన్నది తేలే అవకాశం లేదు. చాలా రోజుల తర్వాత భారీ ఎన్ కౌంటర్ జరుగుతుండటంతో ఇరువైపులా ప్రాణనష్టం ఉంటుందని భావిస్తున్నారు.
జమ్మూ కాశ్మీర్లోని రాజౌరీ జిల్లాలో ఉగ్రవాదులతో జరుగుతున్న ఎన్కౌంటర్లో ఇద్దరు అధికారులు (కెప్టెన్లు) సహా నలుగురు ఆర్మీ సిబ్బంది మరణించారని పోలీసు వర్గాలు ప్రకటించాయి. నిన్న రాజౌరీలోని కలకోట్ ప్రాంతంలో భద్రతా దళాలతో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులు పట్టుబడినట్లు పోలీసులు తెలిపారు. కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ తర్వాత ధర్మాల్లోని బాజిమాల్ ప్రాంతంలో ఉగ్రవాదులు, ఆర్మీ, J-K పోలీసుల ఉమ్మడి దళాల మధ్య ఎన్కౌంటర్ జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ కాల్పుల్లో పలువురు సైనికులకు కూడా గాయాలయ్యాయి.

బజిమల్ ప్రాంతానికి సమీపంలోని గులాబ్ఘర్ అటవీ ప్రాంతాల్లో ఉగ్రవాద సంస్ధ జైష్కి చెందిన కొన్ని చీలిక గ్రూపులు ఉన్నాయి. అక్టోబర్ 5న వీరిని ఆర్మీ గుర్తించింది. కానీ తాజాగా ఆర్మీ కాల్పులు చేయడంతో ఇది చివరికి ఎన్కౌంటర్ గా మారింది.
ఇవాళ ఉగ్ర దాడుల్లో వీరమరణం పొందిన సైనికుల కుటుంబాలకు జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా సంతాపం తెలిపారు.
రాజౌరి నుండి భయంకరమైన వార్త అందిందని, ఇద్దరు అధికారులతో సహా నలుగురు సైనిక సిబ్బంది విధి నిర్వహణలో తమ ప్రాణాలను అర్పించారని తెలిపారు. పీర్ పంచాల్ ప్రాంతంలోని శాంతియుత ప్రాంతాలలో మిలిటెంట్ వ్యాప్తికి కొనసాగుతున్న ప్రయత్నాలను ఖండిస్తూనే.. ఇవాళ అంతిమ త్యాగం చేసిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను" అని అబ్దుల్లా ఎక్స్లో తెలిపారు.
-
ముంబాయి ఇండియన్స్ కెప్టెన్సీ నుంచి హార్డిక్ ఔట్, కొత్త కెప్టెన్ ఫిక్స్..!? -
అప్పటి వరకూ పాకిస్థాన్ కు నో వాటర్: భారత్ సంచలనం -
భారత పారిశ్రామిక వృద్ధి రేటు తగ్గుదల.. యుద్ధం కంటే ముందే..! -
కిర్రాక్ ఫీచర్లతో Boat Valour Watch 1R.. ధర ఎంతంటే ?? -
ఏసీ గదుల్లో ఎక్కువగా ఉంటున్నారా- అయితే, ఇది తెలుసుకోవాల్సిందే..!! -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు












Click it and Unblock the Notifications