కశ్మీర్ ఉగ్రవాదులతో ఎన్ కౌంటర్- ఇద్దరు కెప్టెన్ల సహా నలుగురు సైనికుల వీరమరణం..

జమ్మూ కశ్మీర్లోని రాజౌరీ జిల్లాలో ఇవాళ ఉగ్రవాదులతో జరుగుతున్న ఎన్ కౌంటర్ లో ఇప్పటివరకూ నలుగురు సైనికులు వీరమరణం పొందారు. ఇందులో ఇద్దరు కెప్టెన్లు కూడా ఉన్నారు. ఇంకా ఎన్ కౌంటర్ కొనసాగుతోంది. ఇది పూర్తయితే కానీ ఇంకా ఎంతమంది చనిపోయారన్నది తేలే అవకాశం లేదు. చాలా రోజుల తర్వాత భారీ ఎన్ కౌంటర్ జరుగుతుండటంతో ఇరువైపులా ప్రాణనష్టం ఉంటుందని భావిస్తున్నారు.

జమ్మూ కాశ్మీర్‌లోని రాజౌరీ జిల్లాలో ఉగ్రవాదులతో జరుగుతున్న ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు అధికారులు (కెప్టెన్లు) సహా నలుగురు ఆర్మీ సిబ్బంది మరణించారని పోలీసు వర్గాలు ప్రకటించాయి. నిన్న రాజౌరీలోని కలకోట్ ప్రాంతంలో భద్రతా దళాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు పట్టుబడినట్లు పోలీసులు తెలిపారు. కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ తర్వాత ధర్మాల్‌లోని బాజిమాల్ ప్రాంతంలో ఉగ్రవాదులు, ఆర్మీ, J-K పోలీసుల ఉమ్మడి దళాల మధ్య ఎన్‌కౌంటర్ జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ కాల్పుల్లో పలువురు సైనికులకు కూడా గాయాలయ్యాయి.

4 army officials including 2 captains killed in encounter with terrorists in jammu and kashmir

బజిమల్ ప్రాంతానికి సమీపంలోని గులాబ్‌ఘర్ అటవీ ప్రాంతాల్లో ఉగ్రవాద సంస్ధ జైష్‌కి చెందిన కొన్ని చీలిక గ్రూపులు ఉన్నాయి. అక్టోబర్ 5న వీరిని ఆర్మీ గుర్తించింది. కానీ తాజాగా ఆర్మీ కాల్పులు చేయడంతో ఇది చివరికి ఎన్‌కౌంటర్ గా మారింది.
ఇవాళ ఉగ్ర దాడుల్లో వీరమరణం పొందిన సైనికుల కుటుంబాలకు జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా సంతాపం తెలిపారు.

రాజౌరి నుండి భయంకరమైన వార్త అందిందని, ఇద్దరు అధికారులతో సహా నలుగురు సైనిక సిబ్బంది విధి నిర్వహణలో తమ ప్రాణాలను అర్పించారని తెలిపారు. పీర్ పంచాల్ ప్రాంతంలోని శాంతియుత ప్రాంతాలలో మిలిటెంట్ వ్యాప్తికి కొనసాగుతున్న ప్రయత్నాలను ఖండిస్తూనే.. ఇవాళ అంతిమ త్యాగం చేసిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను" అని అబ్దుల్లా ఎక్స్‌లో తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+