నిజామాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు: ఆరుగురు మృతి

|
Google Oneindia TeluguNews

 4 Killed, 10 Injured While Making Crackers in Lucknow
లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లక్నోలోని ఓ బాణాసంచా ఫ్యాక్టరీలో శనివారం భారీ పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో ఆరుగు మృతి చెందారు. మరో 14మంది తీవ్రగాయాల పాలయ్యారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని కింగ్ జార్స్ మెడికల్ యూనివర్సిటీ ఆస్పత్రికి తరలించారు.

లక్నోలోని మహన్‌లాల్ గంజ్ ఏరియాలో ఈ ఘటన చోటు చేసుకుంది. కాగా, ఈ బాణాసంచా ఫ్యాక్టరీకి ఎలాంటి అనుమతులు లేనట్లుగా సమాచారం. అక్రమంగా మందుగుండు సామాగ్రి తయారుచేస్తున్నట్లు తెలిసింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఆటో బోల్తా ముగ్గురి మృతి

నల్గొండ: జిల్లాలోని గుర్రంపోడు మండలం పాల్వాయి వద్ద శుక్రవారం అర్ధరాత్రి ప్రయాణికులతో వెళ్తున్న ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. కల్వర్టు నిర్మాణం కోసం తీసిన గోతిలో పడిపోవడంతో ఆటో బోల్తా కొట్టింది. క్షతగాత్రులను దేవరకొండ ఆస్పత్రికి తరలించారు.

నిజామాబాద్ జిల్లా సదాశివనగర్ మండలం కల్వరాల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో 10మంది తీవ్రగాయాలపాలయ్యారు. ఆగివున్న లారీని ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు.

English summary

 Four people were killed and 10 injured in a blast on Saturday morning at a house in Lucknow's Mohanlalganj area, where the deceased and the injured were reportedly making crackers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X