420, ఫోర్జరీ ఎవరో ప్రపంచానికే తెలుసు, మోడీ ఇంటి ముందే శశికళ ఫ్యామిలీకి సీఎం వార్నింగ్ !
తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి చిన్నమ్మ శశికళ కుటుంబ సభ్యులకు ఝలక్ ఇచ్చారు. తమిళనాడులో కాకుండా దేశ రాజధాని న్యూఢిల్లీలో శశికళ సోదరి వనితామణి కుమారుడు టీటీవీ దినకరన్ కు గట్టిగానే హెచ్చరించారు.
న్యూఢిల్లీ: తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి చిన్నమ్మ శశికళ కుటుంబ సభ్యులకు ఝలక్ ఇచ్చారు. తమిళనాడులో కాకుండా దేశ రాజధాని న్యూఢిల్లీలో శశికళ సోదరి వనితామణి కుమారుడు టీటీవీ దినకరన్ కు గట్టిగానే హెచ్చరించారు.
మోసగాడు, 420 అనే పదలు టీటీవీ దినకరన్ కు కచ్చితంగా సరిపోతాయని వ్యంగంగా అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయిన ఎడప్పాడి పళనిసామి తరువాత మీడియాతో మాట్లాడారు. జైళ్లు, కోర్టుల చుట్టు ఎవరు తిరుగుతున్నారో ప్రపంచం మొత్తం తెలుసని చెప్పారు.

సీఎంను విమర్శించే ముందు టీటీవీ దినకరన్ తనకు ఏం అర్హత ఉందో తెలుసుకోవాలని ఎడప్పాడి పళనిసామి చూసించారు. టీటీవీ దినకరన్ బెదిరింపులకు ఇక్కడ భయపడేవారు ఎవ్వరూ లేరని ఎడప్పాడి పళనిసామి గట్టిగానే సమాధానం ఇచ్చారు.
తమిళనాడులోని తంజావూరులో టీటీవీ దినకరన్ మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి మోసం చేశాడని, అతను ఓ 420 అని విమర్శించారు. మీడియా ద్వారా ఈ విషయం తెలుసుకున్న తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి హస్తినలో టీటీవీ దినకరన్ కు గట్టిగానే సమాధానం ఇచ్చి పరోక్షంగా హెచ్చరించారు.












Click it and Unblock the Notifications