వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
గోవా లోజైలు నుండి తప్పించుకొనేందుకు ఖైదీల యత్నం, ఒకరు మృతి, 9మందికి గాయాలు
గోవా రాష్ట్రంలోనొ సదా సబ్ జైలు నుండి తప్పించుకొనేందుకు 45 మంది ఖైదీలు ప్రయత్నించారు. ఈ ఘటనలో ఓ ఖైదీ మరణించాడు. మరో 9మంది ఖైదీలు గాయపడ్డారు.ఈ ఘటనలో జైలర్ తీవ్రంగా గాయపడగా,
గోవా సదా సబ్ జైలులో మంగళవారం రాత్రి పూట ఖైదీలకు, జైలు అధికారులకు మద్య స్వల్ప వివాదం చోటుచేసుకొంది. ఈ వివాదం పెద్దదిగా మారింది.
దీంతో ఖైదీలు, జైలు సిబ్బంది మద్య ఘర్షణ చోటుచేసుకొంది.జైలు సిబ్బందిపై ఖైదీలు దాడికి దిగారు. జైలు నుండి తప్పించుకొనేందుకు ఖైదీలు ప్రయత్నించారు.
ఈ జైలులో ఉన్న ఖైదీల్లో సుమారు 45 మంది ఖైదీలు జైలు నుండి తప్పించుకొనే ప్రయత్నం చేశారు. అయితే ఈ ఘటనలో పోలీసులు జైలు నుండి ఖైదీలు తప్పించుకోకుండా అడ్డుకొన్నారు.
ఈ క్రమంలో ఓ ఖైదీ మరణించగా, మరో 9మంది ఖైదీలు గాయపడ్డారు.ఈ ఘటనలో జైలర్ తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో మరో గాయపడిన ఖైదీలను ఆసుపత్రికి తరలించారు.
అయితే ఈ ఘటనకు పూర్తివివరాలు అందాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. ఘటన జరిగిన జైలు వద్ద పోలీసులు అదనపు సిబ్బందిని తరలించారు.జైలును పూర్తిగా ధ్వంసం చేశారు ఖైదీలు.
Comments
English summary
in a shocking incident, at least 45 inmates attempted to escape Sada sub jail in Goa after attacking a number of police officials who tried to stop them on tuesday night.
Story first published: Wednesday, January 25, 2017, 10:56 [IST]