నిద్రిస్తున్న చిన్నారిని ఎత్తుకెళ్లి రేప్: గొంతునులిమి హత్య
రాజస్థాన్ నుంచి ఉపాధి కోసం వచ్చిన బాధిత బాలిక తండ్రి పశ్చిమ ఎక్స్ప్రెస్ హైవే ఫ్లైఓవర్ కింద తన కుటుంబంతోపాటు జీవిస్తున్నాడు. బాధితురాలికి నలుగురు సోదరీమణులు, ఇద్దరు సోదరులు ఉన్నారు. రాజస్థాన్లోని తన స్వస్థలానికి బాధితురాలి తండ్రి వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బాధితురాలి కుటుంబం జీవిస్తున్న కొద్ది దూరంలోనే ఆమె మృతదేహం లభించిందని పోలీసులు తెలిపారు.
బాధిత చిన్నారి ఇతర కుటుంబసభ్యులతో నిద్రిస్తున్న సమయంలో.. శనివారం అర్ధరాత్రి దుండగుడు ఆమెను ఎత్తుకెళ్లి అత్యాచారం చేసి వుంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆదివారం ఉదయం బాధిత చిన్నారి కనిపించకపోవడంతో ఆమె తల్లి చుట్టుపక్కల గాలించింది. కనిపించకపోవడంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు, బాధిత చిన్నారి మృతదేహాన్ని ఫ్లైవర్ కింద గుర్తించారు. అక్కడే కొద్ది రోజుల నుంచి ఉంటున్న కొందరు ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితుల కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. బాధిత చిన్నారి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.