పొలంలో మూత్రించాడని, పురుషాంగాన్ని కోసేశాడు

ఇటుకల బట్టీ కార్మికుడు శేషారాం కుమారుడు రీతేష్ పొలంలో తిరుగుతూ మూత్రం పోస్తున్నప్పుడు దొరికిపోయాడు. ఆ బాలుడిని పొలం యజమాని కొట్టడమే కాకుండా అతని పురుషాంగాన్ని కోసేశాడు. రక్తం ఓడుతూ బాలుడు ఏదో విధంగా ఇంటికి చేరుకున్నాడు.
బాలుడిని అలహాబాద్ ఆస్పత్రిలో చేర్చారు. అతనికి చికిత్స జరుగుతోంది. పొలం యజమాని దుర్గేష్ మౌర్యపై బాలుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదులో మౌర్య కుమారుడిని కూడా నిందితుడిగా చేర్చాడు.
నిందితులు పరారీలో ఉన్నట్లు, వారిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మహిళలపై వరుసగా దారుణాలు జరుగుతున్నాయి. తాజాగా బాలుడిపై ఈ దాడి ఘటన వెలుగులోకి వచ్చింది.












Click it and Unblock the Notifications