50 లక్షల ఉద్యోగాలు, వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్.. తమిళనాడు బీజేపీ మేనిఫెస్టో ఇదే..
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ.. ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రధాన పార్టీలు హామీలు ఇస్తున్నాయి. ఎన్నికలకు సంబంధించి బీజేపీ మేనిఫెస్టో విడుదల చేసింది. కేంద్రమంత్రులు నితిన్ గడ్కరీ, వీకే సింగ్ మేనిఫెస్టోను విడుదల చేశారు. వ్యవసాయ రంగంపై ఫోకస్ చేశారు. ప్రత్యేక బడ్జెట్ కేటాయిస్తామని స్పష్టంచేశాయి. ఇంకా వివిధ హామీలు ఇచ్చాయి. అవెంటో చుద్దాం.
50 లక్షల మందికి ఉపాధి అవకాశం, మత్య్సకారులకు ఏడాదికి రూ.6 వేలు, 8,9 తరగతుల విద్యార్థులకు ఉచితంగా మందుల పంపిణీ, ఇంటింటికీ రేషన్ అందజేస్తామని తెలిపింది. 18 ఏళ్ల నుంచి 23 ఏళ్ల వరకు గల మహిళలకు ఉచితంగా డ్రైవింగ్ లైసెన్స్ అందజేస్తామని పేర్కొన్నది. బీజేపీకి అధికారం కట్టబెడితే ఇంటింటికీ సురక్షిత తాగునీరు అందజేస్తామని తెలియజేసింది. 2022 వరకు మంచినీటి పథకం అందజేస్తామని హామీనిచ్చింది. నదీ పరివాహక ప్రాంతంలో ఇసుక అక్రమ రవాణాపై నిషేధం కొనసాగుతోందని.. దీంతో భూగర్భ జలాలు పెంపొందించే అవకాశం ఉంటుందని తెలిపింది.
చెన్నై కార్పొరేషన్ను మూడు విభాగాలుగా విభజిస్తామని తెలిపింది. దీంతో వేగంగా అభివృద్ధి జరుగుతుందని వివరించింది. గత కొన్నేళ్లుగా వివాదంలో ఉన్న పంచామయి భూ సమస్య పరిష్కరిస్తామని తెలిపింది. 12 లక్షల ఎకరాల భూమిని ఎస్సీలకు అందజేస్తామని వివరించింది. తమిళనాడులో అన్నాడీఎంకేతో కలిసి బీజేపీ పోటీ చేస్తోంది. బీజేపీ 20 స్థానాల్లో అభ్యర్థులను బరిలోకి దింపింది.