జయ మృతి: ఎంత మంది అభిమానులు చనిపోయారంటే !
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత కన్నుమూయడాన్ని తట్టుకోలేక డిసెంబర్ 19వ తేది సోమవారం వరకు 597 మంది మరణించారని అన్నాడీఎంకే పార్టీ వర్గాలు తెలిపాయి. మృతుల కుటుంబాలకు రూ. 3 లక్షల చొప్పున ఆర్థికసాయం .
చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత కన్నుమూయడాన్ని తట్టుకోలేక డిసెంబర్ 19వ తేది సోమవారం వరకు 597 మంది మరణించారని అన్నాడీఎంకే పార్టీ వర్గాలు తెలిపాయి. మృతుల కుటుంబ సభ్యులకు అన్నాడీఎంకే నాయకులు ప్రగాడసానుభూతి తెలిపారు.
సీఎం పగ్గాలు కూడా 'చిన్నమ్మ శశికళ'కే ! ఒకటే భజన
జయలలిత అనారోగ్యంతో డిసెంబర్ 5వ తేదిన అపోలో ఆసుపత్రిలో కన్నుమూసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి అమ్మ జయలలిత మీద అభిమానంతో తీవ్ర దిగ్భ్రాంతికి గురై ఇప్పటి వరకు 597 మంది గుండెపోటుతో మరణించారని అన్నాడీఎంకే నాయకులు చెప్పారు.
మృతుల కుటుంబాలకు రూ. 3 లక్షల చొప్పున ఆర్థికసాయం అందిస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. జయలలిత కన్నుమూసిన తరువాత తమిళనాడులో వివిధ ప్రాంతాల్లో ఉన్న అమ్మ అభిమానులు తీవ్ర ఆవేదనకు గురైనారు.
అమ్మ ఫోటో లేదు: శశికళ ఫ్లక్సీలు ధ్వంసం, తమిళనాట సెగ
జయలలిత మరణించిన విషయం జీర్ణించుకోలేక ఇప్పటి వరకు గుండెపోటుతో మరణించిన వారిని అన్నాడీఎంకే వర్గాలు గుర్తించాయి. అన్ని కుటుంబాలను అన్నాడీఎంకే ఆదుకుంటుందని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.