యువతిపై ఏడుగురు గ్యాంగ్రేప్: సొషల్ సైట్లలో వీడియో, ఒకరి అరెస్ట్
మేవత్: హర్యానా రాష్ట్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ యువతిపై ఏడుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అంతేగాక, ఆ వీడియోను సొషల్ మీడియాలో అప్లోడ్ చేశారు.
కొద్ది నెలల క్రితం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియోలను పరిశీలించిన పోలీసులు, నిందితులలో ఒకర్ని గురువారం అరెస్ట్ చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మేవత్ మూలమలుపు వద్ద కొద్ది నెలల క్రితం ఓ యువతిపై ఏడుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ దృశ్యాలను వీడియో తీసిన నిందితులు.. సొషల్ సైట్లలో అప్లోడ్ చేశారు.
కాగా, ఈ వీడియోను గుర్తించిన స్థానిక ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు పోలీసులకు అందజేశాడు. వీడియో ఆధారంగా దర్యాప్తు జరిపిన పోలీసులు, నిందితులలో ఒకర్ని అరెస్ట్ చేశారు. మిగితా ఆరుగురి కోసం గాలింపు చేపట్టారు.
ఆ వీడియోలో నేరానికి పాల్పడుతున్న ఆరుగురు యువకులు సిగ్గులేకుండా నవ్వుతూ కెమెరాకు ఫోజిచ్చారు. ఆ యువతిని అత్యాచారం చేసుకుంటూ రాక్షసానందాన్ని పొందారు.