వ్యవసాయ బిల్లులపై రగడ - సస్పెండైన రాజ్యసభ ఎంపీల నిరవధిక దీక్ష - ఏకమైన విపక్షాలు
వివాదాస్పద వ్యవసాయ బిల్లులపై రగడ రోజురోజుకూ పెద్దదవుతున్నది. ఓవైపు రోడ్లపై లక్షల మంది రైతులు ఆందోళనలకు దిగగా.. పార్లమెంటులో ప్రతిపక్ష ఎంపీలు సైతం నిరసనలు చేపట్టారు. రాజ్యసభలో ఎన్టీఏకు మెజార్టీ లేకపోయినా.. అప్రజాస్వామికంగా బిల్లుల్ని పాస్ చేయించుకున్నారని విపక్షం మండిపడింది. ఆదివారం సభలో చోటుచేసుకున్న పరిణామాలపై చైర్మన్ తీవ్ర చర్యలకు దిగారు. మొత్తం ఎనిమిది మంది ఎంపీలకు ఈ సమావేశాలు ముగిసేవరకు సస్పెండ్ చేశారు. దీంతో..

పార్లమెంట్ లోనే నిరవధిక దీక్ష
రాజ్యసభ నుంచి సోమవారం సస్పెన్షన్కు గురైన 8 మంది ఎంపీలు పార్లమెంటు ఆవరణలోనే నిరవధిక నిరసన కొనసాగిస్తామని సంచలన ప్రకటన చేశారు. టీఎంసీ ఎంపీ డెరిక్ ఒబ్రెయిన్, డోలా సేన్, ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్, కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ సతవ్, రిపున్ బోరా, సైయద్ నసీర్ హుస్సేన్, సీపీఎం ఎంపీ కేకే రాగేష్, ఎలమారం కరీంలపై రాజ్యసభ చైర్మన్ ఎం.వెంకయ్యనాయుడు.. వారం రోజుల పాటు బహిష్కరణ వేటు వేశారు. రైతుల తరఫున మాట్లాడుతోన్న ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకే ప్రభుత్వం ఈ విధంగా వ్యవహరిస్తున్నదని, బిల్లులు వెనక్కి తీసుకునేదాకా తాము నిరసన కొనసాగిస్తామని ఎంపీలు చెప్పారు.

ఏకమైన విపక్షాలు..
రాజ్యసభలో సస్పెండ్ అయిన 8 మంది ఎంపీలు పార్లమెంట్ ఆవరణలో నిరవధిక దీక్షకు దిగిన తర్వాత విపక్షాలు ఏకమై, వారికి సంఘీభావం ప్రకటించాయి. పలు పార్టీల నేతలు.. దీక్ష చేస్తోన్న ఎంపీలను కలిసి సంఘీభావం తెలిపారు. టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు.. కేంద్ర ప్రభుత్వ తీరును తీవ్రంగా ఆక్షేపించారు. మోదీ సర్కారు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని ఆరోపించారు. వ్యవసాయ బిల్లులను వ్యతిరేకించిన ఎంపీలను సస్పెండ్ చేయడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. టీఆర్ఎస్ సహా పలు పార్టీల నేతలు ఎంపీలకు మద్దతు పలికారు.
Recommended Video

మ్యూటింగ్ ఆఫ్ డెమోక్రసీ..
వ్యవసాయ బిల్లుల విషయంలో పార్లమెంట్ సాక్షిగా మోదీ సర్కారు అప్రజాస్వామిక చర్యలకు పాల్పడిందని, "మ్యూటింగ్ ఆఫ్ డెమోక్రటిక్ ఇండియా" విధానాన్ని బీజేపీ అనుసరిస్తున్నదని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మండిపడ్డారు. కనీసం రైతుల గోడు వినకుండా రూపొందించిన వ్యవసాయ బిల్లుల్ని నల్ల చట్టాలుగా ఆయన అభివర్ణించారు. ప్రభుత్వం ప్రదర్శిస్తోన్న అంతులేని అహంకారం వల్లే దేశానికి ఆర్థిక విపత్తు వచ్చిపడిందని రాహుల్ విమర్శించారు.
-
ప్రతిసారి హిట్ ఎలా కొడతావ్ అన్న! -
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి -
అమెరికా ఆధీనంలో పాకిస్తాన్ రాజధాని -
సూపర్ స్టార్ రజినీకాంత్ "జైలర్ 2"లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్..












Click it and Unblock the Notifications