భారీ అగ్నిప్రమాదం: గ్రామం మొత్తం కాలిబూడిదైంది
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో దాదాపు గ్రామంలోని మొత్తం ఇళ్లు కూడా కాలిబూడదైపోయాయి. 15శాలలు కూడా ఈ ప్రమాదంలో కాలిబూడిదయ్యాయి. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం చోటు చేసుకోలేదని తెలిసింది.
Over 80 houses and 15 cow sheds gutted by fire in Sukhnai village in Kishtwar(J&K) (16.10.16) pic.twitter.com/oYTuWWVk8w
— ANI (@ANI_news) October 17, 2016
కిష్టావర్ జిల్లాలోని సుక్ని గ్రామంలో శనివారం రాత్రి చెలరేగిన మంటల్లో గ్రామంలోని 84 ఇండ్లకు గాను 80 ఇళ్లు కాలిబూడిదయ్యాయి. ఈ ఘటనలో ఏ ఒక్కరూ గాయపడలేదని జిల్లా డిప్యూటీ పోలీసు కమిషనర్ తెలిపారు.
వెంటనే అధికారులు సహాయ చర్యలు చేపట్టారు. గ్రామస్థులు రాత్రంతా టెంట్ల కిందే గడిపారని అధికారులు తెలిపారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోయినప్పటికీ.. భారీ ఎత్తున ఆస్తి నష్టం జరిగిందని, అనేకమంది నిరాశ్రయులయ్యారని చెప్పారు. అయితే, అగ్ని ప్రమాదానికి కారణం మాత్రం తెలియరాలేదు.