వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముంబై బట్టల గోడౌన్‌లో అగ్ని ప్రమాదం..9 మంది మృతి, పలువురికి తీవ్రగాయాలు

|
Google Oneindia TeluguNews

ముంబై: ఢిల్లీలో కొద్ది రోజుల క్రితం జరిగిన అగ్ని ప్రమాద ఘటన మరువకముందే ముంబైలోని నివాస ప్రాంతంలో మరో అగ్ని ప్రమాదం సంభవించింది. కిరారీ ప్రాంతంలో ఉన్న బట్టల గోడౌన్‌లో ఆదివారం రాత్రి అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 9 మంది మృతి చెందినట్లు సమాచారం. పలువురికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన వారిని చికిత్స కోసం హాస్పిటల్‌కు తరలించారు. ఈ నెల ప్రారంభంలో ఢిల్లీలో అనాజ్ మండిలో చోటుచేసుకున్న ప్రమాదంలో 43 మంది మృతి చెందిన విషయం తెలిసిందే.

విలేపార్లేలోని బజాజ్‌ రోడ్డులో ఉన్న లబ్‌శ్రీవలి భవనంలో ఈ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఏడు ఎనిమిద అంతస్తులో ఉన్న మూడు ఫ్లాట్లకు మంటలు వ్యాపించాయి. రెండు గంటల పాటు మంటలు చెలరేగాయి. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమించి మంటలను అదుపు చేశారు.ఇక ఫైర్ సిబ్బంది కాపాడిన వారిలో ఒక మహిళతో పాటు ఐదు మంది ఉన్నారు. టెర్రస్‌పై ఎవరూ లేరని అధికారులు తెలిపారు. అయితే అగ్నిప్రమాదం ఎలా సంభవించిందనేదానిపై విచారణ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

9 killed after fire broke down in Mumbais cloth go down

ఎనిమిదవ అంతస్తులో అగ్ని ప్రమాదం సంభవించిందని ఆ సమయంలో ఒక ఫ్లాట్‌లో ఇంటీరియర్ పనులు జరుగుతున్నాయని అధికారులు తెలిపారు. విచారణ తర్వాతే అన్ని విషయాలు తెలుస్తాయని ఆయన చెప్పారు. ఆదివారం కావడం అది కూడా రాత్రి సమయం కావడంతో పెను ప్రమాదం తప్పిందని అధికారులు తెలిపారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

English summary
At least nine people were killed and 10 injured after a fire broke down in a cloth godown in north Delhi’s Kirari area. The injured were taken to a nearby hospital for treatment.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X