మహిళపై అత్యాచారం, దారుణ హత్య, బెంగళూరులో అర్దనగ్నంగా రోడ్డు పక్కనే శవం !
బెంగళూరు నగరంలో దారుణం జరిగింది. మహిళ మీద అత్యాచారం చేసి హత్య చేసి మృతదేహాన్ని తీసుకు వచ్చి రోడ్డు పక్కన విసిరివేసి వెళ్లారు. బెంగళూరు నగరంలోని కుమారస్వామి లేఔట్ లోని శ్రీ ఓం శక్తి ఆలయం సమీపంలో మంగళవ
బెంగళూరు: బెంగళూరు నగరంలో దారుణం జరిగింది. మహిళ మీద అత్యాచారం చేసి హత్య చేసి మృతదేహాన్ని తీసుకు వచ్చి రోడ్డు పక్కన విసిరివేసి వెళ్లారు. బెంగళూరు నగరంలోని కుమారస్వామి లేఔట్ లోని శ్రీ ఓం శక్తి ఆలయం సమీపంలో మంగళవారం అర్దరాత్రి దాటిన తరువాత మహిళ మృతదేహాన్ని గుర్తించారు.
సుమారు 32 ఏళ్ల మహిళను వేరే ప్రాంతంలో హత్య చేసి మృతదేహాన్ని ఇక్కడికి తీసుకు వచ్చి విసిరివేశారని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మహిళ మృతదేహాన్ని పరిశీలించి ఆసుపత్రికి తరలించారు.
మహిళ మీద అత్యాచారం చేసి హత్య చేసి ఇక్కడ విసిరివేశారని పోలీసులు చెప్పారు. మహిళ అర్దనగ్నంగా ఉండటం, శరీరం మీద గాయాలు ఉండటంతో అత్యాచారం జరిగిందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. హత్యకు గురైన మహిళ పేరు, వివరాలు ఏ మాత్రం చిక్కకుండా హంతకులు జాగ్రత్తలు తీసుకున్నారని, హత్యకు గురైన మహిళ ఎవరు ? అని ఆరా తీస్తున్నామని కుమారస్వామి లేఔట్ పోలీసులు తెలిపారు.