రెండున్నరేళ్ల బాలికపై అత్యాచారం, హత్య కేసులో దోషికి మరణ శిక్ష, 33 రోజుల్లోనే తీర్పు ఇచ్చిన కోర్టు
గుజరాత్లోని సూరత్లో రెండున్నరేళ్ల బాలికపై అత్యాచారం, హత్య కేసులో నిందితుడు గుడ్డు యాదవ్(35)కి మరణ శిక్ష విధిస్తూ సూరత్లోని సెషన్స్ కోర్టు తీర్పునిచ్చింది. బాధితురాలి కుటుంబానికి రూ.20 లక్షల పరిహారం ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. సెషన్స్ కోర్టు రికార్డు స్థాయిలో 33 రోజుల్లోనే తీర్పు వెలువరించడం గమనార్హం.
"సంఘటన జరిగిన నాలుగు రోజుల్లోనే సూరత్ పోలీసులు నిందితుడు గుడ్డు యాదవ్ను అరెస్టు చేశారు. అతడిని పట్టుకోవడానికి 100 మంది పోలీసులు పగలు రాత్రి శ్రమించారు. బాధిత కుటుంబానికి కోర్టు న్యాయం చేసింది. రికార్డు సమయంలో తీర్పు చెప్పింది. బాధితురాలి కుటుంబ సభ్యులకు పరిహారం చెల్లించాలని కూడా ఆదేశించింది.'' అని బీబీసీ ప్రతినిధి భార్గవ్ పారిఖ్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ నయన్ సుఖద్వాలా చెప్పారు.
సూరత్లోని పండేసర ప్రాంతంలో గుడ్డు యాదవ్ ఒక చిన్నారిని తీసుకుని వెళ్లడం సీసీ కెమెరాలో రికార్డయింది. ఆ బాలికపై అత్యాచారం చేసిన తర్వాత, గుడ్డు యాదవ్ ఆమెను హతమార్చాడు. తరువాత ఆమె మృతదేహాన్ని ఖాళీ స్థలంలో పడేశాడని పోలీసులు తెలిపారు. 7 రోజుల్లోనే కోర్టులో ఛార్జిషీటు దాఖలు చేశారు.
ఇవి కూడా చదవండి:
- పాకిస్తాన్లో పెరుగుతున్న ధరలు... 'తక్కువ తినమని' ప్రజలకు మంత్రి సలహా
- MSP: కనీస మద్దతు ధర అంటే ఏమిటి, రైతులు దీనికోసం ఎందుకు పట్టుబడుతున్నారు?
- మోదీ ప్రభుత్వం వ్యవసాయ చట్టాలపై ఎందుకు యూ-టర్న్ తీసుకుందంటే...
- సోషల్ మీడియాలో సిక్కుల పేర్లతో సిక్కులపైనే దుష్ప్రచారం... నకిలీ నెట్వర్క్ గుట్టు రట్టు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)