Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కౌగిలించుకుని చెరువులో శవాలు అయిన జంట, ఆంటీతో ఏమిటి సంబంధం ?

ఒకరినొకరు కౌగిలించుకున్న జంట మృతదేహం లభ్యమైన సంఘటన కర్ణాటకలోని మండ్య జిల్లా పాండవపురలోని హిరోడ్ లోని చెరువులోని నీళ్లు వెళ్లే తూములో ఓ మహిళ, పురుషుడు ఇద్దరూ ఒకరినొకరు కౌగిలించుకుని శవాలై కనిపించారు.

మృతుల గురించి ఎలాంటి సమాచారం అందుబాటులో లేదని పోలీసులు అంటున్నారు. మృతుల వయస్సు 40 నుంచి 45 ఏళ్లు ఉంటుందని పోలీసులు అంచనా వేశారు.

 A couple who hugged each other until death and became corpses

మహిళతో పాటు మరో వ్యక్తి చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని స్థానికులు అనుమానిస్తున్నారు. అనుమానాస్పద స్థితిలో మహిళ, పురుషుడి మృతదేహాలు లభ్యమయ్యాయి. చెరువు గట్టు మీద మట్టిలో మృతదేహం లభ్యం కావడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మూడు రోజుల ఇద్దరూ ఆత్మహత్య చేసుకుని ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.

ఉదయం స్థానికులు చెరువు దగ్గరకు రావడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. దీనిపై పాండవపు టౌన్ పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించారు. ఈ ఘటన పాండవపుర టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. విషయం తెలిసి 2 గంటలు గడిచినా పోలీసులు సంఘటనా స్థలానికి రాలేద స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇద్దరూ అక్రమ సంబందం పెట్టుకుని ఏమైనా ఆత్మహత్య చేసుకున్నారా ? అని అనుమానాలు ఉన్నాయని పోలీసులు అంటున్నారు.

 A couple who hugged each other until death and became corpses
ఇద్దరూ కలిసి ఆత్మహత్య చేసుకుని ఉంటే శవాలు వేర్వేరుగా విడిపోయి ఉండాలని, అయితే అలా కాకుండా శవాలు అయ్యే వరకు ఇద్దరు గట్టిగా కౌగిలించుకుని ఉండటం పలు అనుమానాలకు దారితీస్తోందని మండ్య జిల్లా పోలీసు అధికారులు తెలిపారు. ఆత్మహత్య చేసుకున్న వారి పేర్లు వివరాలు తెలియడం లేదని, కేసు విచారణలో ఉందని మండ్య జిల్లా పోలీసు అధికారులు తెలిపారు.
More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+