వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టీ తాగి ఒకే కుటుంబంలో నలుగురి మృతి

|
Google Oneindia TeluguNews

కాన్పూర్: టీ తాగి ఒకే కుటుంబంలో నలుగురు మరణించిన సంఘటన ఉత్తర్ ప్రదేశ్ లో జరిగింది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ సంఘటన వివరాలను స్థానిక పోలీసులు మీడియాకు చెప్పారు.

కాన్పూర్ సమీపంలోని అమృత్ పూర్ అనే గ్రామంలో రాణి (32) అనే మహిళ నివాసం ఉంటున్నది. ఈమెకు మున్సి (8), కనహియ (7), ఉపాసన (3) అనే ముగ్గురు పిల్లలు ఉన్నారు. రాణి గృహిణి.

A family died after consuming poisonous tea in Uttar Pradesh

ఈమె ఉదయం టీ తయారు చేసి పిల్లలకు ఇచ్చి ఆమె తాగింది. అయితే టీ విషపూరితం కావడంతో వారు నలుగురు కుప్పకూలిపోయారు. వాంతులు, విరేచనాలు అయ్యాయి. కుటుంబ సభ్యులు బంధువులు వారిని ఆసుపత్రికి తరలించడానికి ప్రయత్నించారు.

అయితే నలుగురు చనిపోయారని పోలీసులకు సమాచారం ఇచ్చారు. నలుగురి మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టుం నివేదిక వచ్చిన తరువాత పూర్తి వివరాలు చెబుతామని పోలీసులు తెలిపారు.

English summary
A senior police official said, "The tea is suspected to be poisonous, however, the postmortem report will reveal the truth.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X