టెక్కీ హత్య: గాలింపునకు మానవరహిత వాహనం

నగరంలోని ఐటి కారిడార్ సిరుసెరి సమీపంలో ఉమా మహేశ్వరి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. సిబి-సిఐడి ఆదివారం, సోమవారం రోజుల్లో దట్టమైన పొదలు అలుముకున్న ప్రాంతాల్లో హత్యకు గల ఆధారాలను ఈ మానవేతర వాహనంతో గాలింపు చర్యలు చేపట్టారు. దట్టమైన పొదలు అలుముకున్న ఆ ప్రాంతంలో వాహనం ద్వారా పరిశీలించారు.
తమిళనాడు డిజిపి రామానుజన్ ఈ పరికరాలను ఉపయోగించేందుకు అనుమతించడంతో టెక్కీ హత్య కేసులో ఆధారాలు సేకరించేందుకు ఉపయోగించారు. ఈ పరికరం సహాయంతో పోలీసులు కొన్ని ఆధారాలను సేకరించారు. పోలీసులు గత అక్టోబర్లో ఓసారి కూడా ఈ యూఏవి వాహనాన్ని మధురైలో నిర్వహిస్తున్న మైనింగ్ కార్యకలాపాలను గుర్తించేందుకు ఉపయోగించారు. పలు నేరాల్లో ఆధారాలు సేకరించేందుకు ఈ పరికరం ఉపయోగపడుతుందని మద్రాస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఏరో స్పేసింగ్ ఇంజిరింగ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ సెంథిల్ కుమార్ తెలిపారు.
కాగా ఇలాంటి మూడు యూఏవి వాహనాలను కొనుగోలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా 90 లక్షలు వెచ్చించేందుకు డిజిపి సుముఖత వ్యక్తం చేశారని సెంథిల్ కుమార్ తెలిపారు. తమ వద్ద రెండు వాహనాలు ఉన్నాయని ఆయన చెప్పారు. ఒక చదరపు కిలో మీటరు పరిధిలోని అంశాలను ఈ వాహనం పరిశీలించగలదని తెలిపారు.












Click it and Unblock the Notifications