నోట్లో గుడ్డలు కుక్కి యువతిపై ఇద్దరు పిల్లల తండ్రి రేప్
గురుదాస్ పూర్: పంజాబ్ రాష్ట్రంలోని గురుదాస్పూర్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ యువతిపై ఇద్దరు పిల్లలకు తండ్రి ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతేగాక, ఈ విషయాన్ని ఎవరికీ చెప్పొందంటూ బెదిరింపులకు గురిచేశాడు. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. గురుదాస్పూర్ జిల్లా బదోష్ పట్టణానికి చెందిన ఓ వ్యక్తి ఇంటర్మీడియెట్ చదివే కూతురిని ఇంట్లో ఒంటరిగా వదిలి తన సమీప బంధువు అంత్యక్రియల్లో పాల్గొనేందుకు కుటుంబసభ్యులతో కలిసి వెళ్లారు.

బాలిక ఇంట్లో ఒంటరిగా ఉండటం గమనించిన ఇద్దరు పిల్లల తండ్రి బలవంతంగా ఇంట్లోకి ప్రవేశించి యువతి నోట్లో గుడ్డలు కుక్కి అత్యాచారం జరిపాడు. బాధిత యువతి అలారం మోగించేందుకు యత్నించినా దాన్ని ఆపివేసి అత్యంత దారుణంగా అత్యాచారం చేశాడు.
అంత్యక్రియల నుంచి తిరిగివచ్చిన తల్లిదండ్రులకు బాధిత యువతి జరిగిన దారుణం తెలిపింది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. యువతిని వైద్యపరీక్షల కోసం ఆస్పత్రికి పంపించారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications