గే పెళ్లిలకు చట్టబద్ధత కల్పించాలని సుప్రీం కోర్టుకు వెళ్లిన హైదరాబాదీ జంట..
ప్రత్యేక వివాహ చట్టం, 1954 ప్రకారం స్వలింగ వివాహాన్ని గుర్తించాలని కోరుతూ హైదరాబాద్లో నివసిస్తున్న ఇద్దరు స్వలింగ సంపర్కులు భారత సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ప్రధాన న్యాయమూర్తి డివై నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం శుక్రవారం ఈ పిల్ పై విచారణ చేపట్టనుంది. పిటిషనర్లు సుప్రియో చక్రవర్తి, అభయ్ డాంగ్ దాదాపు 10 సంవత్సరాలుగా కలిసి ఉంటున్నారు.
మహమ్మారి సమయంలో వారు వారి ఇంటికి వేళ్లారు. రెండవ వేవ్ సమయంలో వారిద్దరికీ COVID వచ్చింది. వారు కోలుకున్న తర్వాత వివాహం జరుపుకోవాలని నిర్ణయించుకున్నారు. వారు డిసెంబర్ 2021లో ఒకటైయ్యారు. వీరిని వారి తల్లిదండ్రులు, కుటుంబం, స్నేహితులు ఆశీర్వదించారు. ప్రత్యేక వివాహ చట్టం స్వలింగ జంటలు, వ్యతిరేక లింగ జంటల మధ్య వివక్ష చూపేంత వరకు భారత రాజ్యాంగానికి విరుద్ధమని పిటిషనర్లు పేర్కొన్నారు.
కులాంతర, మతాంతర జంటలు తమకు నచ్చిన వ్యక్తిని వివాహం చేసుకునే హక్కును భారత సర్వోన్నత న్యాయస్థానం ఎల్లప్పుడూ పరిరక్షించిందని పిటిషనర్లు వివరించారు. స్వలింగ వివాహాలు ఈ రాజ్యాంగ యాత్రకు కొనసాగింపని తెలిపారు. నవతేజ్ సింగ్ జోహార్, పుట్టస్వామి కేసులలో, ఎల్జిబిటిక్యూ+ వ్యక్తులు రాజ్యాంగం హామీ ఇచ్చిన సమానత్వం, గౌరవం, గోప్యత హక్కును ఇతర పౌరులందరితో సమానంగా అనుభవిస్తున్నారని సుప్రీంకోర్టు పేర్కొందని గుర్తు చేశారు. పిటిషనర్లు ఇప్పుడు తమకు నచ్చిన వ్యక్తిని వివాహం చేసుకునే హక్కు LGBTQ+ పౌరులకు కూడా విస్తరించాలని కోరారు.

ప్రత్యేక వివాహ చట్టం, విదేశీ వివాహ చట్టం, హిందూ వివాహ చట్టం కింద స్వలింగ వివాహాలను గుర్తించాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టు, కేరళ హైకోర్టులో ప్రస్తుతం 9 పిటిషన్లు పెండింగ్లో ఉన్నాయి. ఈ నెల ప్రారంభంలో, డిప్యూటీ సొలిసిటర్ జనరల్ కేరళ హైకోర్టు ముందు ఒక ప్రకటన చేశారు, అన్ని రిట్ పిటిషన్లను సుప్రీంకోర్టుకు బదిలీ చేయడానికి మంత్రిత్వ శాఖ చర్యలు తీసుకుంటోందని తెలిపారు.
ప్రత్యేక వివాహ చట్టం స్వలింగ జంటలు, వ్యతిరేక లింగ జంటల మధ్య వివక్ష చూపే వరకు భారత రాజ్యాంగానికి విరుద్ధంగా ఉందని పిటిషనర్లు సమర్పించారు. ప్రత్యేక వివాహ చట్టం, 1954లో స్వలింగ సంపర్కుల గురించి ప్రత్యేక ప్రస్తావన లేదు. దీనిపై విచారణ జరిపి సర్వోన్నత న్యాయస్థానం ఎలాంటి తీర్పునిస్తుందో చూడాలి.












Click it and Unblock the Notifications