ఇంటిలో ఒంటరిగా నవ వధువు, అనుమానాస్పద స్థితిలో శవమైంది, పంచాయితీలు, ఏం జరిగింది ? !
బెంగళూరు: కుటుంబ సమస్యలతో విసిగిపోయిన నవ వధువు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన బెంగళూరు నగరంలో జరిగింది. వైట్ ఫీల్డ్ రోడ్డులోని ఐటీపీఎల్ సమీపంలో నివాసం ఉంటున్న శిల్పా(27) అనే నవ వధువు ఆత్మహత్య చేసుకుందని పోలీసులు తెలిపారు. అనుమానాస్పద మృతి కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని మహదేవపుర పోలీసులు తెలిపారు.

హ్యాపీగా నవ దంపతుల కాపురం
బెంగళూరు గ్రామీణ జిల్లా హోస్ కోటే సమీపంలోని హిండిగనాళ గ్రామానికి చెందిన రామప్ప, దేవమ్మల కుమార్తె శిల్పాకు నాగేష్ అనే వ్యక్తితో వివాహం అయ్యింది. నాగేష్, శిల్పా దంపతులు ఐటీపీఎల్ రోడ్డులోని హుడీలో నివాసం ఉంటున్నారు.

ఇంటిలో ఒంటరిగా శిల్పా !
నాగేష్, అతని కుటుంబ సభ్యులు ఇంటి నుంచి బయటకు వెళ్లిన సమయంలో శిల్పా ఇంటిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుందని సమాచారం. ఇంటికి వచ్చి విషయం గుర్తించిన నాగేష్ శిల్పా కుటుంబ సభ్యులు, మహదేవపుర పోలీసులకు సమాచారం ఇచ్చాడు.

అనేక అనుమానాలు
మహదేవపుర పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి వివరాలు సేకరించారు. నాగేష్ ఇంటిలో ఎవరు లేని సమయంలో శిల్పా శవమై కనిపించడంతో ఆమె కుటుంబ సభ్యులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వివాహం అయిన తరువాత కొన్ని నెలలు నాగేష్, శిల్పా దంపతులు అన్యోన్యంగా ఉన్నారని సమాచారం.

పెద్దల పంచాయితీలు
నాగేష్ కుటుంబ సభ్యులు పదేపదే శిల్పాను వేధింపులకు గురి చేశారని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపించారు. కుటుంబ సభ్యులు, పెద్దలు పంచాయితీలు చేశారని, అయినా నాగేష్, అతని కుటుంబ సభ్యులు శిల్పాను వేధింపులకు గురి చెయ్యడం వలనే ఇలా జరిగిందని శిల్పా కుటుంబ సభ్యులు పోలీసులకు చెప్పారు. అనుమానాస్పద మృతి కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని మహదేవపుర పోలీసులు తెలిపారు.
-
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
పాకిస్థాన్ లోనే ఫాస్టెస్ట్ ట్రైన్ ఇదేనట.. స్పీడ్ చూస్తే మాత్రం.. మన ప్యాసింజర్ ట్రైన్స్ నయం..! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!!












Click it and Unblock the Notifications