కిరాతకం:భార్యసహ ఐదుగురిని హత్య చేసి,ఇలా.....
కుటుంబ కలహలు ఓ కుటుంబాన్ని ఛిన్నాబిన్నం చేసింది. భార్య, భర్తల మద్య గొడవలతో భర్త ఏకంగా ఐదుగురిని హత్య చేశాడు. హత్యల తర్వాత నిందితుడు పోలీసులకు లొంగిపోయాడు.
బళ్ళారి:కుటుంబ కలహల కారణంగా ఐదుగురు కుటుంబ సభ్యులను కత్తితో నరికి దారుణంగా హతమార్చాడు. ఈ ఘటన కర్ణాటకలోని బళ్ళారి జిల్లాలోని కంప్లిలో చోటుచేసుకొంది.ఈ హత్యలు చేసిన తర్వాత నిందితుడు పోలీసులకు లొంగిపోయాడు.అయితే హత్యలకు ఇంకా కారణాలు ఉన్నాయనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు.
కురుగుడో పట్టణానికి చెందిన తిప్పణ్ణ భార్య, మరదలు, ముగ్గురు పిల్లలతో కలిసి కంప్లిలో నివసిస్తున్నాడు.తిప్పణ్ణకు బార్యతో కొద్దిరోజులుగా భార్యతో గొడవలు జరుగుతున్నాయి.

తిమ్మప్ఫ తన భార్య ఫక్కీరమ్మ, కుమారుడు ఇద్దరు కుమార్తైలు, మరదలు గంగమ్మను కత్తితో నరికి చంపాడు. ఈ దాడిలో తీవ్ర్ంగా గాయపడిన ఐదుగురు అక్కడికక్కడే మరణించారు. పోలీసులు ఘటనా స్థలాన్ని సందర్శించారు. నిందితుడు పోలీసులకు లొంగిపోయారు. కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
భార్య, భర్తల మద్య కొంత కాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈ గొడవలకు తాళళేకే తిమ్మణ్ణ వారిని హత్య చేశాడని పోలీసులు చెబుతున్నారు.అయితే ఈ హత్యలకు ఇంకా ఏమైనా కారణాలున్నాయనే అనే కోణంలో కూడ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications