ప్రియుడితో ఎంజాయ్ చేస్తున్న భార్య, మటన్ మార్కెట్ భర్త ఏం చేశాడంటే ?, అర్దరాత్రి అంతా ఓకే !
భార్య అక్రమ సంబంధం పెట్టుకున్న విషయం తెలుసుకున్న భర్త ఆవేదనతో కుమిలిపోయాడు. పద్దతి మార్చుకోవాలని భార్యకు చాలాసార్లు బుద్దిమాటలు చెప్పాడు. మొదటే మాంసం దుకాణం నడుపుతున్న భర్త ప్రతిరోజు లెక్కలేనన్ని గెర్రెలు, మేకలు కోస్తున్నాడు. అక్రమ సంబంధం పెట్టుకుని తన పరువు తీస్తున్న తన భార్యను కూడా ఇలాగే గొర్రెను కోసినట్లు కోసేయాలని భర్త చాలా కాలం నుంచి వేచి చూశాడు.
పశ్చిమ బెంగాల్లోని బెహలాకు చెందిన 41 ఏళ్ల వ్యక్తి రాత్రి అతని భార్యను గొంతు కోసి చంపడమే కాకుండా మరుసటి రోజు వరకు సైలెంట్ గా అతని పనులు అతను చేసుకున్నాడు. ఇంటి పని అంతా తానే పూర్తి చేసిన భర్త మరుసటి రోజు ఉదయం వంట చేసి పిల్లలకు పెట్టి వాళ్లను పాఠశాలకు పంపాడు. ఆ తర్వాత భర్త అతని భార్యను హత్య చేసిన విషయాన్ని పోలీసులకు ఫోన్ చేసి చెప్పాడు. స్థానిక మీడియా నివేదికల ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.

కూతురిని, కొడుక్కి టిఫిన్ తినిపించి వారిని రెడీ చేసి ఇద్దరిని బడికి పంపేందుకు సిద్దం అయ్యాడు. పొద్దున్నే నిద్రలేచి భోజనం సిద్ధం చేసిన కార్తీక్ అతని పిల్లలు ఇద్దరిని పాఠశాలకు పంపిన అనంతరం పోలీసులకు ఫోన్ చేసి తన భార్య సంపతిని తానే హత్య చేశానని సమాచారం ఇచ్చాడు. పోలీసులకు ఫోన్ చేసి విషయం చెప్పిన తరువాత కార్తీక్ అతని భార్య సంపతి తల్లికి ఫోన్ చేసి పిల్లలను స్కూల్ నుంచి మీ ఇంటికి తీసుకెళ్లాలని చెప్పాడు.
పోలీసులు ఇంటికి చేరుకునే సమయానికే కార్తీక్ అతని పిల్లలకు అవసరమైన వస్తువులు, బట్టలు, డబ్బులు బ్యాగులో నింపాడు. పోలీసులు మహాబిర్తలాలోని న్యూ అలీపూర్ సమీపంలోని ఇంటికి చేరుకుని చూడగా కార్తీక్ దాస్ అలియాస్ కార్తీక్ అతని భార్య సంపతి మృతదేహం ముందు ప్రశాంతంగా కూర్చున్న విషయం గుర్తించి బిత్తరపోయారు. పోలీసుల కథనం ప్రకారం కార్తీక్కు అదే ప్రాంతంలో కిరాణా దుకాణం తోపాటు మాంసాహార దుకాణం ఉంది. కిరాణా షాపును కార్తీక్ భార్య సంపతి చూసుకుంటున్నది.

కార్తీక్ మంసాహారం దుకాణం చూసుకుంటున్నాడు. తన భార్య సంపతి వివాహేతర సంబంధం పెట్టుకుందని కార్తీక్ కు చాలా కాలం నుంచి అనుమానం వచ్చిందని, ఇదే విషయంలో ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరిగేవని పోలీసులు తెలిపారు. ఇదే విషయంలో రాత్రి గొడవ మరింత పెరిగింది. తరువాత ఆవేశానికి లోనైన కార్తీక్ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నాడు. అయితే నా భార్య చేసిన తప్పుకు నేను ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్న కార్తీక్ అతని భార్యను చంపేయాలని అనుకున్నాడు.
తరువాత భార్య సంపతి గొంతు కోసి ఆమెను హత్య చేసిన తరువాత ఆమె శవాన్ని బెడ్ రూమ్ లో పెట్టి పైన దుప్పటి కప్పేశాడు. మీ అమ్మకు ఆరోగ్యం బాగాలేదని, ఆమె విశ్రాంతి తీసుకుంటున్నదని కార్తీక్ అతని పిల్లలకు చెప్పాడని పోలీసు అధికారులకు తెలిపారు. కార్తీక్ వాంగ్మూలాన్ని తీసుకుని దానిని పరిశీలిస్తున్నామని, కార్తీక్ పిల్లలను వారి అమ్మమ్మ నివాసానికి తీసుకెళ్లారా ?, లేదా అనేదానిని నిర్ధారించుకుంటున్నామని పోలీసులు తెలిపారు. పోలీసులు సంపతి మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించి నిందితుడు కార్తీక్ ను అదుపులోకి తీసుకుని అతని మీద హత్య కేసు నమోదు చేశామని పోలీసు అధికారులు తెలిపారు.
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్












Click it and Unblock the Notifications