జయలలిత కొడనాడు టీ ఎస్టేట్ లో హత్య: కేరళలో అరెస్టు, కుట్ర వెనుక!
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు చెందిన కొడనాడు టీ ఎస్టేట్ లో జరిగిన హత్య కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు కేరళలో విచారణ ముమ్మరం చేశారు.
చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు చెందిన కొడనాడు టీ ఎస్టేట్ లో జరిగిన హత్య కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు కేరళలో విచారణ ముమ్మరం చేశారు. కేరళలో శుక్రవారం ఓ నిందితుడిని తమిళనాడు పోలీసులు అరెస్టు చేసి ఈ హత్య వెనుక ఎవరెవరు ఉన్నారు అని ఆరా తీస్తున్నారు.
కొడనాడు టీ ఎస్టేట్ సెక్యూరిటీ గార్డు ఓం బహుదూర్ ను హత్య చేసిన విషయం తెలిసిందే. కొడనాడు ఎస్టేట్ లో సుమారు 10 మంది దుండగులు చోరబడి ఓం బహుదూర్ ను అతి దారుణంగా హత్య చేసి జయలలిత గదిలో చోరబడి విలువైన పత్రాలు చోరీ చేశారని వెలుగు చూసింది.

జయలలిత ఆస్తుల పత్రాలు చోరీ చెయ్యడానకి హత్య జరిగిందని, జయ ఎస్టేట్ లో భారీ మొత్తంలో బ్లాక్ మనీ ఉందని, ఆ నగదు, నగలు లూటీ చెయ్యడానికి హత్య జరిగి ఉంటుందని మీడియాలో వార్తలు వచ్చాయి. కేసు నమోదు చేసిన పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేశారు.
కేరళకు వెళ్లిన పోలీసులు జయలలిత కొడనాడు ఎస్టేట్ లో జరిగిన హత్య కేసుకు సంబంధించి శుక్రవారం ఉదయం ఒకరిని అరెస్టు చేశారు. అతన్ని రహస్య ప్రాంతంలో విచారణ చేస్తున్నారు. ఆ నిందితుడు తెలిపే వివరాల ఆధారంగా మిగిలిని నిందితులను అరెస్టు చెయ్యాలని పోలీసులు ప్రయత్నిస్తున్నారు.












Click it and Unblock the Notifications