బీహార్ లో ఉన్న భార్య, బెంగళూరులో ? ఇద్దరితో రొమాన్స్, ఇంటి పక్కన, కుక్క బతుకు !
పాట్నా/ బెంగళూరు: బీహార్కు (Bihar) చెందిన వ్యక్తిని మారణాయుధాలతో అతి కిరాతకంగా హత్య చేసిన ఘటన బెంగళూరు (Bengaluru) నగరంలోని సంపిగేహళ్లి సమీపంలోని కోగిలు లేఅవుట్లో చోటుచేసుకుంది. షకీల్ అక్తర్ అలియాస్ షకీల్ సాబ్ (28) అనే యువకుడు హత్యకు గురైనాడని పోలీసులు తెలిపారు. షకీల్ అక్తర్ పదేళ్ల క్రితం బెంగళూరు (Bengaluru) చేరుకుని ఇక్కడే పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు.
బెంగళూరులోని (Bengaluru) ఓ కార్పొరేటర్ ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీలో చాలా సంవత్సరాల నుంచి షకీల్ అక్తర్ పనిచేస్తున్నాడు. షకీల్ అక్తర్ కు ఇద్దరు మహిళలతో వివాహమైంది. షకీల్ అక్తర్ భార్యల్లో (wife) ఒకరు బీహార్లో ఉంటున్నదని, మరో భార్య బెంగళూరులోనే (Bengaluru) అతనితో కలిసి నివాసం ఉంటోందని పోలీసుల ప్రాథమిక విచారణలో వెలుగు చూసింది.

రెండు రాష్ట్రాల్లో ఇద్దరు మహిళలతో వివాహం చేసుకున్న షకీల్ అక్తర్ జల్సాగా కాపురం చేస్తున్నాడు. రెండో భార్య (wife), బిడ్డతో కలిసి బెంగళూరు (Bengaluru) లోనే షకీల్ అక్తర్ ఎక్కువ రోజులు ఉంటున్నాడని పోలీసులు తెలిపారు. ఇదే సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు కొందరు షకీల్ అక్తర్ను దారుణంగా హతమార్చారు. హత్య (murder) చేసిన అనంతరం నిందితులు షకీల్ అక్తర్ మృతదేహాన్ని సంచిలో కట్టి ఇంటి ముందున్న ఖాళీ స్థలంలోని గోతిలో పడేసి పరారయ్యారు.
షకీల్ అక్తర్ హత్యకు గురి అయ్యాడు అనే మ్యాటర్ మొదల బయటకురాలేదు. అయితే ఖాళీ స్థలంలో శవం పడిఉండటంతో వీధి కుక్కలు ఆ ప్రాంతంలో ఎక్కువగా మొరగడంతో స్థానికులకు అనుమానం వచ్చి సంపేగేహళ్లి పోలీసులకు సమాచారం ఇచ్చారు. బెంగళూరు (Bengaluru) పోలీసులు ఘటనా స్థలాన్ని సందర్శించి షకీల్ అక్తర్ హత్య (murder) ఎలా జరిగింది అని పరిశీలించారు.

ప్రస్తుతం షకీల్ అక్తర్ హత్య ఘటనపై సంపిగేహళ్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కావడంతో నిందితుల కోసం పోలీసులు (police)గాలిస్తున్నారు. ఇద్దరు మహిళలతో పెళ్లి చేసుకోవడం వలన హత్య జరిగిందని షకీల్ అక్తర్ బంధువులు ఆరోపిస్తున్నారు. అక్రమ సంబందం (aunty) కారణంగా షకీల్ అక్తర్ హత్య జరిగి ఉంటుందని పోలీసు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే షకీల్ అక్తర్ హత్యకు కచ్చితమైన కారణాలు మాత్రం ఇంకా బయటకురాలేదని తెలిసింది.
బెంగళూరులోని (Bengaluru) లగ్గెరె 16వ క్రాస్లో గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. మృతదేహా ఇసుకలో పాతిపెట్టినట్లు పోలీసులు. మృతుడి వయసు 35 ఏళ్లు ఉంటుందని వెలుగు చూసింది. శవాన్ని వీధి కుక్కలు చింపేసి ఇసుకను తవ్వగా బయట మృతదేహం కనిపించింది. ఈ ఘటనను చూసిన చుట్టుపక్కల స్థానికులు ఆందోళన చెంది పోలీసులకు సమాచారం అందించారు. రాజగోపాల్నగర్ పోలీసులు సంఘటనా స్థలాన్ని సందర్శించి పరిశీలించారు.

ఇల్లు (house) కట్టుకోవడానికి యజమాని ఇసుక తీసుకొచ్చారు. గత మూడు రోజుల క్రితం వచ్చిన ఇసుక లోడులో మృతదేహం లభ్యం అయ్యింది. ఇసుక లోడులో హత్య చేసిన వ్యక్తి శవాన్ని పాతిపెట్టి ఉంటారని అనుమానిస్తున్నారు. దీంతో పోలీసులు ఇల్లు (house) నిర్మిస్తున్న యజమానిని పిలిపిస్తున్నారు. ప్రస్తుతం ఇంటి యజమాని తమిళనాడులోని (Tamil Nadu) ఓ పట్టణానికి వెళ్లాడు. కేసులు విచారణలో ఉన్నాయి.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications