Wife: బయటకు వెళ్లిన భర్త, ముగ్గురు పిల్లలను చంపేసి ఆత్మహత్య చేసుకుంది, అంతలో ?
బెంగళూరు/విజయపుర: వివాహం చేసుకున్న దంపతులు సంతోషంగా కాపురం చేశారు. దంపతులకు పిల్లలు ఉన్నారు. చాలా సంవత్సరాల నుంచి దంపతులు చాలా సంతోంగా కాపురం చేశారు. అయితే ఇటీవల దంపతుల మద్య గొడవలు మొదలైనాయని తెలిసింది. దంపతుల మధ్య గొడవల కారణంగా ముగ్గురు పిల్లలను హత్య చేసిన తల్లి ఆమె ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది.
కర్ణాటకలోని విజయపుర జిల్లాలోని తిక్కోటా తాలుకాలోని జాలగేరి గ్రామంలో రాము అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. చాలా సంవత్సరాల క్రితం రాము గీతా అనే మహిళను వివాహం చేసుకున్నాడు. చాలా సంతోంగా కాపురం చేసిన రాము, గీతా దంపతులు బంధువుల ఇళ్లకు తిరుగతూ వచ్చారు. రాము, గీతా దంపతులకు బేబి (6), సమర్థ (4), కిషన్ (3) అనే ముగ్గురు పిల్లలు ఉన్నారు.

కొంతకాలంగా దంపతుల మద్య గొడవలు జరుగుతున్నాయని తెలిసింది. పని మీద రాము ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. ఆ సమయంలో గీతా ఆమె ముగ్గురు పిల్లలతో కలిసి ఇంటిలోనే ఉంది. రాత్రి పని ముగించుకుని ఇంటికి వెళ్లిన రాము అతని భార్య గీతాతో పాటు అతని ముగ్గురు పిల్లలు కనపడకపోవడంతో హడలిపోయాడు.
భార్య గీతాతో పాటు పిల్లలు కనపడకపోవడంతో రాము ఊరు మొత్తం గాలించాడు. బంధువులు కూడా గీతా, ఆమె పిల్లల కోసం గాలించారు. అయితే ఎక్కడ కూడా గీతా, ఆమె పిల్లల ఆచూకి చిక్కలేదు. అనుమానం వచ్చి ఇంటి నీటి సంప్ లో గాలించగా తల్లీ గీతాతో పాటు ఆమె ముగ్గురు పిల్లలు శవమై కనిపించడం కలకలం రేపింది. గీతా ఆమె ముగ్గురు పిల్లలను ఎందుకు హత్య చేసి ఆమె కూడా ఆత్మహత్య చేసుకుంది అనే వియంలో కచ్చితమైన సమాచారం లేదని, కేసు విచారణలో ఉందని పోలీసు అధికారులు అంటున్నారు.












Click it and Unblock the Notifications