Crime: ప్రియుడితో కలిసి బిడ్డకు నరకం చూపిస్తున్న తల్లి..
పెళ్లి చేసుకుంది. కొద్ది రోజులు భర్త కాపురం చేసింది. ఓ బిడ్డకు జన్మనిచ్చింది. భర్తతో గొడవలు పడి విడిపోయింది. ఆ తర్వాత మరో వ్యక్తితో సహజీవనం చేస్తూ కన్న బిడ్డను చిత్రహింసలు పెట్టింది. అమ్మతనానినికి మచ్చ తెచ్చింది. పడక సుఖం కోసం బిడ్డను రాచిరంపన పెడుతున్న ఆ మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన చెన్నైలో జరిగింది.

వివాహేతర సంబంధం
తమిళనాడు చెన్నై శా స్త్రినగర్కు చెందిన భాను భర్త నుంచి విడిపోయి రెండున్న ఏళ్ల ఆడబిడ్డతో కలసి జీవిస్తోంది. ఈ క్రమంలో ఆమెక్ అదే ప్రాంతానికి చెందిన జగన్జోష్తో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఆ తర్వాత వారిద్దరు సహజీవనం చేస్తున్నారు. అయితే వారి సుఖానికి బడ్డ అడ్డు వస్తుందన్న కోపంతో పసి పాపను చిత్రహింసలు పెట్టేవారు. ఎప్పుడు కొడుతూ ఉండేవారు.

సిగరెట్తో పాప ముఖంపై
సెప్టెంబర్ 29నజగన్ జోష్ అత్యంత కృరంగా సిగరెట్తో పాప ముఖంపై కాల్చడు. దీంతో చిన్నారిస్పృ హ తప్పి పడిపోయింది. చనిపోతే తనపైకి నేరం వస్తుందని భాను చిన్నారిని చెన్నై ఎగ్మోర్ ఆస్పత్రికి తరలించింది. ఈ సంగతి తెలుసుకున్న భాను తల్లి కన్నియమ్మల్ ఆస్పత్రికి వచ్చి చిన్నారిని చూసి ఆగ్రహం వ్యక్తం చేసింది. ముఖం, వీపుపై వాతలను గమనించింది.

అడ్డుగా ఉందనే
కన్నియమ్మల్ వెంటనే అడయార్ మహిళా పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన కూతరు తన మనవరాలిని చిత్రహింసలకు గురి చేస్తుందని ఫిర్యాదులో పేర్కొంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు భాను, జగన్జోష్ను అరెస్ట్ చేసి విచారించారు. తమకు
అడ్డుగా ఉందని బిడ్డను చిత్రహింసలు పెడుతున్నట్లు వారు ఒప్పుకున్నారు.












Click it and Unblock the Notifications