Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

డైరెక్ట్ గా బెడ్ రూమ్ లోకి వస్తున్న ప్రియుడు, కూతురితోనే సమస్య, తల్లి మాత్రం !

అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్న కూతురిని ఆమె తల్లి హత్య చేసిన ఘటన కర్ణాటకలోని ధారవాడ నగరంలోని కమలాపూర్ లోని హుగర ఓణిలో చోటుచేసుకుంది. తల్లి జ్యోతి, ఆమె ప్రియుడు రాహుల్ కలిసి మైనర్ అమ్మాయిని గొంతు కోసి హత్య చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. హుబ్బళిలోని నవనగర్‌కు చెందిన రాహుల్‌తో అక్రమ సంబంధం పెట్టుకున్న జ్యోతి భర్తను నిర్లక్షం చేసింది.

కొంతకాలం క్రితం భర్తకు దూరం అయిన జ్యోతి ఆమె కూతురితో కలిసి వేరుగా నివాసం ఉంటున్నది. ఇంట్లో కూతురు మాత్రమే ఉండటం, అడిగేవాళ్లు కరువు కావడంతో జ్యోతి ఆడింది ఆటగా పాడిందిపాటగా తయారైయ్యింది. ప్రియుడు రాహుల్ ను నేరుగా ఇంటికే పిలిపించుకుంటున్న జ్యోతి అతనితో పిచ్చపాటిగా ఎంజాయ్ చేస్తోంది. అయితే నిత్యం మన ఇంటికి రాహుల్ ఎందుకు వస్తున్నాడని కూతురు తల్లి జ్యోతిని ప్రశ్నించింది.

A mother who killed her daughter along with her boyfriend was arrested in Dharwada

కొంతకాలం కూతురికి ఏదో ఒకరకంగా మాయమాటలు చెబుతూ వచ్చిన జ్యోతి ప్రియుడ రాహుల్ ను ఇంటికే పిలిపించుకుంటూ ఉంది. అయితే రాహుల్ ప్రవర్తనలో తేడాలు రావడంతో జ్యోతిని ఆమె కూతురు గట్టిగా నిలదీసిందని సమాచారం. తన కూతురు బతికుంటే తన అక్రమ సంబందానికి పదేపదే అడ్డుపడుతుందని, కన్నకూతురు పీడ విడగించుకోవాలని జ్యోతి గట్టిగా డిసైడ్ అయ్యింది.

గురువారం రాత్రి కూతురిని జ్యోతి, ఆమె ప్రియుడు రాహుల్ కలిసి హతమార్చినట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి నిందితురాలు జ్యోతి, ఆమె ప్రియుడు రాహుల్‌ను ధారవాడలోని సబర్బన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత ఆరు రోజుల్లో ధార్వాడలో ఐదు హత్యలు జరిగాయి. తల్లి జ్యోతి ఆమె ప్రియుడు రాహుల్ తో కలిసి కన్న కూతురి గొంతు కోసి హత్య చేసినట్లు ఆరోపణలు రావడం ఆ ప్రాంతంలో కలకలం రేపింది.

A mother who killed her daughter along with her boyfriend was arrested in Dharwada

అసిస్టెంట్ కలెక్టర్ కార్యాలయ సిబ్బంది ఆత్మహత్యకు యత్నించిన ఘటన కర్ణాటకలోని రాయచూరు నగరంలోని జిల్లా స్టేడియంలో చోటుచేసుకుంది. రాయచూరు జిల్లా అసిస్టెంట్ కలెక్టర్ కార్యాలయంలో రికార్డు కీపర్‌గా పనిచేస్తున్న వాసీం(35) ఆత్మహత్యకు యత్నించాడని పోలీసులు అంటున్నారు. పై అధికారి వేధింపులకు తాళలేక వాసీం యాసిడ్‌ తాగినట్లు ఆరోపణలు వచ్చాయి.

గురువారం మధ్యాహ్నం వరకు ఏసీ కార్యాలయంలోనే ఉన్న వాసీం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో రాయచూరు జిల్లా స్టేడియం వద్దకు వెళ్లి అక్కడ యాసిడ్ తాగినట్లు సమాచారం. ప్రస్తుతం వాసీం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని, అతను మృత్యువుతో పోరాడుతున్నాడని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై వాసీం కుటుంబ సభ్యులు రాయచూర్ వెస్ట్ స్టేషన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వాసీం యాసిడ్ తాగలేదని, అయితే అతనిని చంపేందుకు ఎవరో మా కుమారుడితో బలవంతంగా యాసిడ్ తాగించారని ఆరోపించారని, దీనిపై పూర్తిస్థాయి విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. కేసు విచారణలో ఉందని పోలీసులు తెలిపారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+