పరీక్షలకు భయపడి అమ్మాయి ఏం చేసిందంటే ?, కూతురు చదువు కోవాలని ఒంటరిగా !
విద్యార్థులు అందరూ పరీక్షల మూడ్లో ఉన్నారు. అయితే మనస్థాపానికి గురై ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడటంతో ఆమె కుటుంబ సభ్యులు సాటి విద్యార్థులు హడలిపోయారు.
బెంగళూరు/కొడుగు: దేశవ్యాప్తంగా విద్యార్థులు పరీక్షల మూడ్ లో ఉన్నారు. పలు రాష్ట్రాల్లో ఇప్పటికే 10వ తరగతి పరీక్షలు మొదలైనాయి, పలు రాష్ట్రాల్లో పదవ తరగతి పరీక్షల్లో ఒకే ఒక్క పరీక్ష మిగిలిఉంది. కర్ణాటక రాష్ట్రవ్యాప్తంగా మార్చి 13 నుంచి వార్షిక పరీక్షలు ప్రారంభం అయ్యాయి. 1 నుండి 9వ తరగతి విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు, అయితే అందులో 5వ తరగతి, 8వ తరగతి విద్యార్థులకు పరీక్షలు ఇప్పుడే నిర్వహించడం లేదు,
విద్యార్థులు అందరూ పరీక్షల మూడ్లో ఉన్నారు. అయితే మనస్థాపానికి గురై ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడటంతో ఆమె కుటుంబ సభ్యులు సాటి విద్యార్థులు హడలిపోయారు. అమ్మాయి కుటుంబంలో ఎలాంటి మానసిక కుంగుబాటుకు గురికాకపోయినా కేవలం పరీక్షల ఒత్తిడితో మైనర్ అమ్మాయి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది.

కర్ణాటకలోని కొడుగు జిల్లాలోని సోమవారపేట్ పట్టణంలో వైష్ణవి (13) అనే అమ్మాయి నివాసం ఉంటున్నది, సోమవారపేట్ లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో వైష్ణవి 7వ తరగతి చదువుతోంది. వారం రోజుల క్రితం కర్ణాటకలో 7వ తరగతి పరీక్షలు మొదలైనాయి. పరీక్షలు రాయడానికి వెలుతున్న వైష్ణవి ఇంటికి వెళ్లిన తరువాత ఈ రోజు పరీక్ష బాగానే రాశాను అని ఆమె తల్లిదండ్రులకు చెబుతోంది.
సోమవారం పరీక్ష ఉండటంతో వైష్ణవి ఇంట్లో చదువుకుంటున్నది. అమ్మాయి 7వ తరగతి పాస్ కావాలని అనుకున్న ఆమె కుుటంబ సభ్యులు ఆదివారం సాయంత్రం ఇంటి నుంచి బయటకు వెళ్లారు. నువ్వు బాగా చదువుకో అని వైష్ణవికి చెప్పిన తల్లి కూడా బంధువులతో కలిసి బయటకు వెళ్లిపోయారు. ఆ సందర్బంలో ఇంటిలో ఒంటరిగా ఉన్న వైష్ణవి చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
రాత్రి ఇంటికి వెళ్లిన కుటుంబ సభ్యులు వైష్ణవి ఆత్మహత్య చేసుకున్న పోలీ్సులకు సమాచారం ఇచ్చారు. 7వ తరగతి పరీక్షల ఒత్తిడితోనే వైష్ణవి ఆత్మహత్య చేసుకుందనని, ఆమె ఇంట్లో కుటుంబ సభ్యులతో చాలా సంతోషంగానే ఉండేదని పోలీసులు తెలిపారు. సాటి అమ్మాయి ఆత్మహత్య చేసుకోవడంతో ఆమెతో పాటు చదువుతున్న అమ్మాయిలకు కుటుంబ సభ్యులు ధైర్యం చెప్పి పరీక్షలు రాయడానికి పంపిస్తున్నారు,
-
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక












Click it and Unblock the Notifications