మర్మాంగం మీద పెట్రోల్ పోసి నిప్పంటించి వీడియో తీసి యూట్యూబ్ లో పెట్టారు, వైరల్!
చెన్నై: రోడ్డు పక్కన నిద్రపోతున్న వ్యక్తి మర్మాంగం మీద పెట్రోల్ పోసి నిప్పంటించి అతని ప్రాణాలు తియ్యడానికి ప్రయత్నించిన ఘటన చెన్నై నగరంలో జరిగింది. చెన్నైలోని కూడంబాక్కం ప్రాంతంలో జాఫర్ (50) అనే వ్యక్తి మీద హత్యాయత్నం జరిగిందని పోలీసులు చెప్పారు.
కూడంబాక్కంలోని రాంగరాజపురంలోని ఇండియన్ బ్యాంకు సమీపంలో అర్దరాత్రి 1.30 గంటల సమయంలో జాఫర్ రోడ్డు పక్కన నిద్రపోతున్నాడు. పీకలదాక మద్యం సేవించిడంతో జాఫర్ అపస్మారకస్థితిలో ఉన్నాడు. ఆ సందర్బంలో ముగ్గురు నిందితులు అటు వైపు వెళ్లారు.

మద్యం, పెట్రోల్ పోసి !
తరువాత మద్యం, పెట్రోల్ జాఫర్ మర్మాంగం మీద పోసి నిప్పంటించారు. తీవ్రగాయాలు కావడంతో జాఫర్ నిద్రలేచి కేకలు వేశాడు. ఆ సందర్బంలో నిందితులు పైప్ లు తీసుకుని జాఫర్ మీద దాడి చేసి హత్య చెయ్యడానికి ప్రయత్నించారు.

వీడియో తీశారు!
జాఫర్ మర్మాంగానికి నిప్పంటించే సమయంలో ఇద్దరు నిందితులు అతని దగ్గరే ఉన్నారు. మరో నిందితుడు మొబైల్ లో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. పైకి లేచి మంటలు అదుపు చేసుకోవడానికి ప్రయత్నించిన జాఫర్ మీద మళ్లీ దాడి జరిగింది.

యూట్యూబ్ లో వైరల్ !
సోషల్ మీడియాలో ఆ వీడియో వైరల్ కావడంతో పలువురు పోలీసులకు సమాచారం ఇచ్చారు. జాఫర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న పోలీసులు అతన్ని విచారించి వివరాలు సేకరించారు.

వీడియోలో అడ్డంగా బుక్కయ్యారు!
సోషల్ మీడియాలో వీడియో పరిశీలించిన పోలీసులు శ్యామ్, పూహళేంది, రాజేష్ అనే ముగ్గురిని అరెస్టు చేశారు. మద్యం మత్తులో ఉన్న తన మీద నిందితులు ముగ్గురూ కలిసి హత్యాయత్నం చేశారని జాఫర్ అంగీకరించాడని పోలీసులు తెలిపారు.

కారణం తెలీదు!
జాఫర్ మర్మాంగం మీద పెట్రోల్, మద్యం పోసి నిప్పంటించిన నిందితులు పీకలదాక మద్యం సేవించారని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. అయితే జాఫర్ ఫిర్యాదు చేసిన తరువాతే ఎఫ్ఐఆర్ నమోదు చెయ్యాలని పోలీసు అధికారులు నిర్ణయించారని సమాచారం. జాఫర్ మర్మాంగం మీద పెట్రోల్ పోసి ఎందుకు నిప్పంటించారు ? అని ఆరా తీస్తున్నామని అధికారులు తెలిపారు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications