Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ప్రియుడి మోజులో అర్దరాత్రి భర్త ప్రైవేట్ పార్ట్స్ ను ? రెండు వారాలకు నోటిదూలతో ఫోన్ లో !

వివాహం చేసుకున్న దంపతులు సంతోషంగా కాపురం చేశారు. దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఇటీవల కాలంలో దంపతుల మద్య గొడవలు ఎక్కువ అయ్యాయి. భార్య గంటలు గంటలు ఆమె ప్రియుడితో ఫోన్ లో మాట్లాడుతోంది. మ్యాటర్ తెలుసుకున్న భర్త మద్యం సేవించి అతని భార్యను చితకబాదడం మొదలుపెట్టాడు. భర్తను హత్య చెయ్యడానికి భార్య పక్కాప్లాన్ చేసింది.

తోపన్న లమాని అలియాస్ తోపన్న (44) అనే వ్యక్తి హత్యకు గురైనాడు. తోపన్న భార్య శాంతా లమాని అలియాస్ శాంతా ఆమె భర్తను హత్య చేసినట్లు వెలుగు చూసింది. భర్త హత్య జరిగిన రెండు వారాల తర్వాత హత్య కేసు వెలుగులోకి వచ్చింది. అయితే అప్పటికే సహజ మరణం అని భర్త తోపన్న అంత్యక్రియులు చేసేసి దినాలు కూడా పెట్టేయడంతో ఇప్పుడు అసలు మ్యాటర్ బయటకు వచ్చింది. శాంతా ఆమె భర్త తోపన్న మర్మాంగం గట్టిగా పిసికేయడం వలనే అతని చనిపోయాడని వెలుగులోకి వచ్చింది.

A wife who was killed by an intoxicated husband who assaulted her private parts in Karnataka

కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లాలోని కారవార సమీపంలోని ముండేగోడ ప్రాంతంలో తోపన్న అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. 20 ఏళ్ల క్రితం తోపన్న శాంతా అనే మహిళను వివాహం చేసుకున్నాడు. తోప్పన్న, శాంతా దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. తోపన్న విపరీతంగా మద్యం తాగేవాడని తెలిసింది. మద్యం మత్తులో ఉంటున్న తోపన్న సంసార సుఖం ఇవ్వడం లేదని అతని భార్య శాంతా ఓ ప్రియుడిన సెట్ చేసుకుందని తెలిసింది.

భార్య శాంతా అక్రమ సంబంధం తెలుసుకున్న తోపన్న రోజూ మద్యం సేవించి ఇంటికి వెళ్లి అతని భార్యతో గొడవపడేవాడని తెలిసింది. దీంతో విసిగి వేసారిన భార్య శాంత ఆమె భర్తను చంపేసి ప్రియుడితో ఎంజాయ్ చెయ్యాలని అనుకుంది. భర్తను అంతమొందించాలని శాంతా కొంతకాలం నుంచి పథకం వేసిందని తెలిసింది. ఎప్పటిలాగే భర్త తోపన్న రెండు వారాల రోజుల క్రితం మద్యం సేవించి ఇంటికి వెళ్లాడు.

తాగిన మైకంలో ఇంటికి వచ్చిన భర్త తోపన్నను హత్య చేసిన అతని భార్య శాంతా తర్వాత ఎవరికీ అనుమానం రాకూడదని ప్లాన్ చేసింది. తాగిన మైకంలో ఇంటికి వచ్చిన తన భర్త తోపన్న కిందపడి చనిపోయాడని అతని భార్య శాంతా ఓ కట్టుకథ అల్లింది. భర్త కుటుంబ సభ్యులు, బంధువులు, ఊర్లో వాళ్లకు శాంతా అదే మాట చెప్పింది.

తోపన్న మద్యానికి బానిస కావడం, ప్రతిరోజు విపరీతంగా మద్యం సేవించడంతో అతని కుటుంబ సభ్యులు, స్థానికులు కూడా అతను కిందపడి సహజంగానే మృతి చెంది ఉంటాడని భావించారు.

తరువాత, కుటుంబ సభ్యులు, బంధువులు కలిసి తోపన్న అంత్యక్రియలను పూర్తి చేశారు. తోపన్న అంత్యక్రిలు జరిగి రెండు వారాలు గడిచిపోయింది. అయితే రోజులు గడిచే కొద్దీ శాంతా నోరు మట్టంగా ఉండలేకపోయింది. శాంతా ఆమె ప్రియుడితో మొబైల్‌లో ఎక్కువగా మాట్లాడుతుంది. ఆ సమయంలో ప్రియుడితో మాట్లాడుతున్న శాంతా నా మొగుడి మర్మాంగం పూర్తిగా నలిపేసి హత్య చేశానని, అయితే అందరూ అతనిది సహజ మరణం అని అనుకుంటున్నారని, నేను కేసు నుంచి తప్పించుకున్నానని మొబైల్ ఫోన్ లో మాట్లాడుతూ శాంతా నోరుజారింది.

A wife who was killed by an intoxicated husband who assaulted her private parts in Karnataka

అయితే శాంతా టైమ్ బాగా లేకపోవడంతో ఆమె ప్రియుడు ఫోన్ స్వీకర్ ఆన్ చెయ్యడంతో ఆ మాటలు ఇరుగుపొరుగు వారు విని అక్కడా ఇక్కడా మాట్లాడుకోవడంతో ఆ సమాచారం కుల సంఘం పెద్దలకు తెలిసిపోయింది. అనంతరం కుల పెద్దలు సమావేశమై శాంతా మొబైల్‌ను పరిశీలించి విచారించారు. శాంతా ఫోన్ లో ఆమె ప్రియుడి ఫోన్ నెంబర్ ఉన్న విషయం బయటకు వచ్చింది. శాంతా ఫోన్ లో గంటలు గంటలు ఆమె ప్రియుడితో మాట్లాడుతున్న విషయం వెలుగు చూసింది.

శాంతా తన భర్త తోపన్న మర్మాంగం గట్టిగా నులిమేసి అతని మర్మాంగం మీద దాడి చేసి మంచం మీదనే అతన్ని హత్య చేసినట్లు అంగీకరించింది. ఈ ఘటనపై ముండగోడ పోలీస్ స్టేషన్‌లో పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు శాంతాను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ప్రియుడి మోజులో పడిని భార్య శాంతా ఆమె భర్త తోపన్న మర్మాంగాన్ని నులిమి హత్య చెయ్యడం కారవార పరిసర ప్రాంతాల్లో కలకలం రేపింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+