షాక్ :మరో యువతిని పెళ్ళాడేందుకు సిద్దమయ్యాడని మర్మాంగాలను కోసిన ప్రియురాలు
మాజీ ప్రియుడిని ఇంటికి పిలిచి మరీ దాడి చేసింది ఓ వివాహిత, ప్రేమించుకొని పెళ్ళిచేసుకొందామనుకొన్నారు. కాని, సాధ్యపడలేదు. ఆమె వేరే వ్యక్తిని పెళ్ళిచేసుకొంది. ప్రియుడిని ఇంటికి పిలిచి ఆమె దాడి చేసింది.
భోపాల్:వారిద్దరూ ప్రేమించుకొన్నారు. పెళ్ళిచేసుకొందామనుకొన్నారు. కాని, కారణాలేమిటో కాని వారిద్దరూ మాత్రం పెళ్ళిచేసుకోలేదు. కాని, ప్రియుడిని తన ఇంటికి పిలిపించి ప్రియురాలు ప్రియుడిపై దాడికి పాల్పడింది. ఈ ఘటన మద్యప్రదేశ్ లో చోటుచేసుకొంది.
మధ్య ప్రదేశ్ రాష్ట్రంలోని బోఫాల్ సమీపంలో చోటుచేసుకొన్న ఘటన కలకలం రేపుతోంది. ఇద్దరూ ప్రేమించుకొన్నారు. అయితే పెళ్ళి కూడ చేసుకొందామనుకొన్నారు. కాని , సాధ్యపడలేదు.
మధ్య ప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్ పరిధిలోని సిద్ది జిల్లాలోని నవగన్వకు చెందిన ఇద్దరు ప్రేమించుకొన్నారు. పెళ్ళి చేసుకోవాలని భావించినా కుదరలేదు.అయితే ఆమె వేరే వ్యక్తిని వివాహం చేసుకొంది.ఆయనతో కాపురం చేస్తోంది.అయితే ప్రియుడికి పెళ్ళి చేసేందుకుగాను కుటుంబసభ్యులు ప్రయత్నిస్తున్నారు.
ఈ విషయాన్ని ప్రియురాలికి తెలిసింది. ప్రియుడికి ఫోన్ చేసి మరీ ఆమె పిలిచింది. ఆదివారం నాడు ఆమె ఇంటికి వెళ్ళిన ప్రియుడికి చుక్కలు చూపించింది ప్రియురాలు.
పెళ్ళి వివరాలను అడిగింది. ఇంకా వివాహం కాలేదు. అమ్మాయిని వెతుకుతున్నారని ప్రియురాలికి చెప్పాడు ప్రియుడు.దీంతో ఆమె ప్రియుడితో గొడవపడింది.
తన దగ్గరున్న ఉన్న కత్తితో ప్రియుడిపై దాడి చేసింది. మర్మాంగాలను గాయపర్చింది. ఆమె నుండి తప్పించుకొన్న ప్రియుడు ఆసుపత్రిలో చేరారు. ఈ తరహ ఘటన జరగడం ఇది రెండో సారి. గత ఏడాది ఇదే తరహ ఘటన చోటుచేసుకొందని స్థానికులు చెబుతున్నారు.