భర్త అక్రమ సంబంధం, లైవ్ లో వీడియో తీసిన భార్య ఏం చేసిందంటే ?
యువతి, యువకుడి పెళ్లి చెయ్యాలని పెద్దలు నిర్ణయించారు. పెళ్లికూడా గ్రాండ్ గానే జరిగింది. వివాహం చేసుకున్న దంపతులు చాలా సంతోషంగా కాపురం చెయ్యడంతో సంవత్సరం తరువాత లక్షణమైన అమ్మాయి పుట్టింది. నాలు సంవత్సరాలు పాటు దంపతుల కాపురం చాలా సవ్యంగా, సంతోషంగా సాగిపోయింది. తర్వాత దంపతుల మధ్య ఓ మహిళ ఎంట్రీ ఇవ్వడంతో వారి కాపురంలో చిచ్చురేపింది.
తన భర్తకు వేరే మహిళతో అక్రమ సంబంధం ఉందంటూ ఓ భార్య లైవ్ వీడియో తీసి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఐటీ హబ్ లోని బెంగళూరు నగరంలోని బ్యాడరహళ్లిలో చోటుచేసుకుంది. మానస(25) అనే మహిళ ఆత్మహత్య చేసుకుంది. మానసకి దిలీప్తో ఆరు ఏళ్ల క్రితం వివాహమైంది. మానస కుటుంబ సభ్యులు గ్రాండ్ గా పెళ్లి చేశారు. మానస, దిలీప్ దంపతులకు ఐదు ఏళ్ల కుమార్తె ఉంది. భార్య, కుమార్తెలో దిలీప్ చాలా సంతోషంగా ఉండేవాడని బందువులు అంటున్నారు.

అయితే దిలీప్ బెంగళూరులోనే వేరే ప్రాంతంలో నివాసం ఉంటున్న మరో మహిళతో ఏడాదిన్నరగా సహజీవనం సాగిస్తున్నాడని సమాచారం. ఈ విషయమై భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవి. మానస ఆమె భర్త దిలీప్ అక్రమ సంబందం గురించి ఆమె పుట్టింటి వాళ్లకు సమాచారం ఇచ్చింది. అల్లుడు దిలీప్ అక్రమ సంబంధం విషయం తెలుసుకున్న మానప కుటుంబ సభ్యులు అతని ఇంటికి వెళ్లి బుద్దిమాటలు చెప్పి పద్దతి మార్చుకోవాలని, నీకు ఓ కుమార్తె ఉందని నచ్చచెప్పారు.
అయితే దిలీప్ మాత్రం అతని ప్రియురాలిని వదిలిపెట్టడానికి అంగీకరించలేదని, ఆమెతోను ఎక్కువగా కాలం గడిపేవాడని తెలిసింది.
దీంతో విసిగిపోయిన మానస ఆదివారం ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవాలని డిసైడ్ అయ్యింది. బెంగళూరులోని ఆంధ్రాహళ్లి తన భర్త దిలీప్ ఇంట్లోనే మానస ఉంది. ఆదివారం రాత్రి మానస ఆమె మొబైల్ ఫోన్ ఆన్ చేసి లైవ్ లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
ఈ ఘటన తర్వాత మానస కుటుంబ సభ్యులు దిలీప్ కుటుంబంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దిలీప్ వేధింపుల వల్లే మానస ఆత్మహత్యకు పాల్పడిందని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపించారు.
విషయం తెలుసుకున్న మానస కుటుంబ సభ్యులు బెంగళూరు నగరంలోని బ్యాడరహళ్లి పోలీస్ స్టేషన్ దగ్గరకు వెళ్లి భర్త దిలీప్ ను నిలదీశారు. తరువాత సహనం కోల్పోయిన మానస బందువులు దిలీప్ పై దాడికి పాల్పడ్డారు.
మానస మృతదేహాన్ని బెంగళూరులోని విక్టోరియా ఆసుపత్రి మార్చురీకి తరలించిన బ్యాడరహళ్లి పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. భర్త దిలీప్ అక్రమ సంబంధం కారణంగానే తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని మానస లైవ్ లో మాట్లాడుతూ ఆత్మహత్య చేసుకోవడంతో ఆమె మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకుని విచారణ చేస్తున్నామని బెంగళూరు పోలీసులు తెలిపారు.
-
ఆశలు ఆవిరి చేస్తోన్న బంగారం ధరలు -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, మూడు రోజుల్లో పూర్తి..!! -
అనసూయకు అవమానం..? వీడియో -
డిగ్రీలెందుకు దండగ.. గాడిదలు ఉంటే పండగ! -
షాకింగ్ న్యూస్: పదో తరగతి పరీక్షలు రద్దు -
వధువు కంటే వదినే హైలైట్.. ఆ రాయల్ లుక్ మామూలుగా లేదుగా! -
విజయ్ దేవరకొండ నివాసానికి సీఎం రేవంత్.. కొత్తజంటకు స్పెషల్ విషెస్.. -
మార్చి 21 తర్వాత పాకిస్తాన్ ఉండదు- రాసిపెట్టుకోండి: బాంబు పేల్చిన జ్యోతిష్యురాలు -
today rashiphalalu: రాహుసూర్యుల శక్తివంతమైన యోగంతో ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
కుప్ప కూలుతున్న బంగారం ధరలు- బిగ్ డౌన్ ఫాల్ -
ఓటీటీలోకి 'పూకీ' మూవీ.. ఇక రచ్చ రచ్చే..! -
ఏపీలో వాహనదారులకు భారీ షాక్-అసెంబ్లీలో బిల్లు..!












Click it and Unblock the Notifications