ఆధార్ వల్ల గోప్యతకు భంగం కలగదు.. అదొక గుర్తింపు మాత్రమే : నందన్ నిలేకని
ఢిల్లీ : ఆధార్ కార్డు వాడకంపై ఎన్నో అనుమానాలు, మరెన్నో ఊహాగానాలు. ఆధార్ కార్డుతో తమ డేటా చోరీ అవుతోందనే వాదనలు వినిపిస్తున్నాయి. అదే సమయంలో వినియోగదారుల గోప్యతకు అర్థం లేకుండా పోతోందనే ఆరోపణలున్నాయి. అయితే అలాంటి వాటికి యునిక్ ఐడెంటిఫికేషన్ ఆథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) మాజీ ఛైర్మన్ నందన్ నిలేకని తాజాగా చేసిన వ్యాఖ్యలు సమాధానంగా కనిపిస్తున్నాయి.
ఆధార్ అనేది కేవలం ఒక గుర్తింపు మాత్రమేనని వ్యాఖ్యానించారు నందన్ నిలేకని. ఆధార్ కార్డు ద్వారా వ్యక్తుల మీద నిఘా పెట్టడం కుదరదని స్పష్టం చేశారు. అంతేకాదు ఆయా వ్యక్తుల గోప్యతకు భంగం కలిగించడం కూడా కుదరదని తేల్చి చెప్పారు. ఫిక్కీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో పలువురు అడిగిన ప్రశ్నలకు ఈ విధంగా సమాధానాలు ఇచ్చారు.

ఆధార్ మీద ఇలాంటి చర్చ ఆహ్వానించదగ్గ పరిణామమని అభిప్రాయపడ్డారు నిలేకని. ఆధార్ గుర్తింపు సంఖ్యను అన్ని దరఖాస్తుల్లో వాడుతూ, వాటిని సమ్మిళితం చేస్తే మాత్రం ఆందోళన చెందొద్దని సూచించారు. ఆధార్ అనేది చాలా సరళీకృతమైన వ్యవస్థ అని అభివర్ణించారు. పర్సనల్ ఇన్ఫర్మేషన్ సేకరించినప్పుడు మాత్రమే గోప్యతకు సంబంధించిన సమస్యలు తలెత్తుతాయని చెప్పుకొచ్చారు. ఆధార్ కార్డుల ద్వారా వ్యక్తుల సమాచారం సేకరించలేదని స్పష్టం చేశారు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications