ఎన్నికల్లో పోటీచేసేందుకు కనీస వయసు 21 చేయాలి..!!
ప్రజాస్వామ్య దేశాల్లో భారత్ అత్యంత పిన్న వయస్కురాలున్న దేశమని రాజ్యసభ సభ్యులు ఆమ్ఆద్మీ పార్టీ నేత రాఘవ చద్దా అన్నారు. రాజ్యసభలో మాట్లాడిన ఆయన అత్యంత పిన్న వయస్సు కలిగి ఉన్న భారత్లో రాజకీయ నాయకులు మాత్రం అత్యంత పెద్ద వయసున్నవారని చెప్పారు. అందుకే ఎన్నికల్లో పోటీచేసేందుకు కావాల్సిన వయస్సు 25 ఏళ్ల నుంచి 21 ఏళ్లకు కుదించాలని డిమాండ్ చేశారు. అలా అయితే చట్టసభల్లో యువనాయకత్వం కనిపిస్తుందని అన్నారు. భవిష్యత్తు యువతరానిదే అన్నప్పుడు చట్టసభల్లో వారికి ప్రాధాన్యత పెంచాలని అన్నారు.
ఎన్నికల్లో పోటీచేయాలంటే కనీస వయస్సును 25 ఏళ్లు ఉండాలనిరాఘవ్ చద్దా డిమాండ్ చేశారు. మన దేశ జనాభాలో 65శాతం జనాభా 35 ఏళ్ల కంటే తక్కువగా ఉన్నారు, 50శాతం జనాభా 25 ఏళ్ల వయసు కంటే తక్కువగా ఉన్నారని చెప్పారు.దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక ఏర్పాటైన తొలి లోక్సభలో 26శాతం మంది సభ్యులు 40 ఏళ్ల కంటే తక్కువ వయసున్న వారుండేవారని గుర్తు చేశారు. అయితే రెండ నెలల క్రితం కొత్తగా ఏర్పాటైన 17వ లోక్సభలో 12శాతం మంది సభ్యులు 4 ఏళ్ల కంటే తక్కువ వయసున్నవారున్నారని చెప్పారు.

#WATCH | In Rajya Sabha, AAP MP Raghav Chadha demands the minimum age for contesting elections in India should be reduced from 25 years to 21 years.
— ANI (@ANI) August 1, 2024
He says "India is one of the youngest countries in the world. 65% of our population is less than 35 years old and 50% of our… pic.twitter.com/NjL8p2Qjmb
యువ దేశంలో వృద్ధ రాజకీయ నాయకులు ఉన్నారని యువతకు ప్రాధాన్యత ఇచ్చేలా ఎన్నికల్లో పోటీచేసే వయసును 21 ఏళ్లకు కుదించాలని చెప్పారు.యువ రాజకీయ నాయకులతో యువదేశంగా భారత్ ఎదగాలని ఆయన ఆకాంక్షించారు.ఇది ప్రభుత్వానికి ఒక సూచన మాత్రమే తాను చేస్తున్నట్లు రాఘవ్ చద్దా చెప్పుకొచ్చారు. రాజకీయాలపై ప్రజల్లో మంచి అభిప్రాయం లేదని చెప్పిన రాఘవ్ చద్దా... తల్లి దండ్రులు వారి పిల్లలను ఒక డాక్టర్గానో లేదా ఇంజినీర్గానో లేదా క్రీడాకారుడిగానో అవ్వాలని చెబుతున్నారని చెప్పారు. రాజకీయాల్లోకి ఎందుకు పంపడం లేదని రాఘవ్ చద్దా సభలో ప్రశ్నించారు.
రాజకీయ నాయకుడు లేదా రాజకీయాల్లో చేరమని ఎవరూ ప్రోత్సహించరని, అయితే రాజకీయాల్లో ఉంటే దేశానికి ఎంత మంచి చేయగలమో అన్న విషయాన్ని తల్లిదండ్రులు పిల్లలకు చెప్పాలని అన్నారు. ఒక నాయకుడిని ఎన్నుకునేందుకు ప్రజలకు ఉండాల్సిన అర్హత 18 ఏళ్లు అయినప్పుడు ఒకరు చట్టసభల్లో ఎంట్రీ ఇచ్చేందుకు లేదా పోటీచేసేందుకు 21 ఏళ్ల వయసు ఎందుకు ఉండకూడదని ఆయన ప్రశ్నించారు.
ప్రభుత్వం చట్టసభల్లో యువతకు ప్రాధాన్యత ఇవ్వాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు రాఘవ్ చద్దా. 2012లో ఆమ్ ఆద్మీ పార్టీ పుట్టినప్పటి నుంచి రాఘవ్ చద్దా ఆ పార్టీలో ఉన్నారు. ప్రస్తుతం 35 ఏళ్లు వయసున్న రాఘవ్ చద్దా... పంజాబ్ రాష్ట్రం నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. అంతకుముందు ఆయన చార్టర్డ్ అకౌంటెంట్గా పనిచేసేవారు. ఆమ్ ఆద్మీ అధినేత ఢిల్లీ సీఎం కేజ్రీవాల్కు రాఘవ్ చద్దా అత్యంత సన్నిహితులు.
-
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
తెలుగు హీరోయిన్తో స్టార్ క్రికెటర్ ఎంగేజ్మెంట్! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు












Click it and Unblock the Notifications