Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఆరుషి హత్య కేసు: తల్లిదండ్రులు నిర్దోషులే, అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అరుషి తల్వార్ హత్య కేసులో అలహాబాద్ హైకోర్టు గురువారం సంచలన తీర్పు ఇచ్చింది. ఈ కేసులో ఇప్పటికే జైలు శిక్ష అనుభవిస్తున్న అరుషి తల్లిదండ్రులను నిర్దోషులుగా పేర్కొంది.

Recommended Video

    Aarushi Talwar Case : ఆరుషి హత్య కేసు : అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు | Oneindia Telugu

    అలహాబాద్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆరుషి తల్వార్ హత్య కేసులో అలహాబాద్ హైకోర్టు గురువారం సంచలన తీర్పు ఇచ్చింది. ఈ కేసులో ఇప్పటికే ఘజియాబాద్ జైలు శిక్ష అనుభవిస్తున్న ఆరుషి తల్లిదండ్రులను నిర్దోషులుగా పేర్కొంది.

    నోయిడాలోని జలవాయి విహార్‌లో 2008 మే 16న ఆరుషి తల్వార్(14) హత్యకు గురైంది. ఆరుషిని ఆమె తల్లిదండ్రులైన నూపుర్ తల్వార్, రాజేష్ తల్వార్‌లు ఇంటి పనిమనిషి హేమరాజ్‌తో కలిసి హత్య చేసినట్టు ఉత్తరప్రదేశ్ కోర్టు 2013లో తీర్పుచెబుతూ నూపుర్, రాజేష్‌ తల్వార్‌లకు జీవిత ఖైదు విధించింది.

    Aarushi’s parents did not murder her says Allahabad High Court

    అయితే ఈ తీర్పుపై ఆరుషి తల్లిదండ్రులు చేసుకున్న అప్పీల్‌పై జస్టిస్ బీకే నారాయణ, జస్టిస్ ఏకే మిశ్రాలతో కూడిన హైకోర్టు బెంచ్ గత సెప్టెంబర్‌లో విచారణ జరిపి తీర్పును రిజర్వ్ చేసింది.

    తాజాగా గురువారం సాయంత్రం అలహాబాద్ హైకోర్టు బెంచ్ తన తీర్పును ప్రకటించింది. ఆరుషిని తల్లిదండ్రులే చంపారనేందుకు తగిన ఆధారాలు లేవని తీర్పులో పేర్కొంటూ రాజేష్‌ తల్వార్‌, నూపుర్ తల్వార్ లను నిర్దోషులుగా ప్రకటించింది.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+