అమ్మ ఆత్మ ఇచ్చిన తీర్పు: పన్నీర్, తెర మీదకు‘జయ’సెంటిమెంట్ !

చెన్నై: తమిళనాడు అపద్దర్మ ముఖ్యమంత్రి ఇప్పుడు జయలలిత సెంటిమెంట్ తో ముందుకు దూసుకుపోతున్నారు.అన్నాడీఎంకే పార్టీ తాత్కాలిక చీఫ్ శశికళకు వ్యతిరేకంగా సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుకు అమ్మ సెంటిమెంట్ జోడించి తనకు అనుకూలంగా మలుచుకుంటున్నారు పన్నీర్ సెల్వం.

ఇది అమ్మ ఏర్పాటు చేసిన ప్రభుత్వం, ఇది అమ్మ ఇచ్చిన తీర్పు అని ఆయన ప్రచారం మొదలుపెట్టారు. శశికళపై తిరుగుబాటు చేసే సమయంలో జయలలిత సమాధి వద్ద పన్నీర్ సెల్వం అమ్మ ఆత్మ చెప్పింది అనే సెంటిమెంట్ ను ప్రజల ముందుకు తీసుకు వచ్చారు.

ఇప్పుడు శశికళకు వ్యతిరేకంగా సుప్రీం కోర్టు తీర్పు ఇవ్వడంతో మరో సారి అమ్మ సెంటిమెంట్ ను తెరమీదకు తీసుకు వచ్చారు. జయలలిత ఆశించిన ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకే అమ్మ ఆత్మనే ఈ తీర్పు చెప్పిందని పన్నీర్ సెల్వం అంటున్నారు.

Acting Tamil Nadu Chief Minister Panneerselvam started a signature campaign

అమ్మ ఆశయాలు కాపాడుకోవడానికి, అమ్మ పాలన సాగేందుకు దోహదపడడం మన కర్తవ్యం అని పన్నీర్ సెల్వం చెబుతున్నారు. అందుకే శశికళ శిభిరంలో ఉన్న ఎమ్మెల్యేలు బయటకురావాలని పిలుపునిచ్చారు. పన్నీర్ సెల్వం పిలుపుమేరకు శశికళ శిభిరంలోని ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు బయటకు వచ్చేస్తున్నారు.

ఇప్పటికే జయలలిత మేనకోడలు దీపా జయకుమార్ ప్రత్యక్షంగా అమ్మ సమాధి సాక్షిగా పన్నీర్ సెల్వంతో కలిసి పనిచేస్తానని మీడియాకు చెప్పారు. జయలలిత నిజమైన వారసురాలు దీపానే అని అన్నాడీఎంకే కార్యకర్తలు ఇప్పటికే గట్టిగా చెప్పారు. కార్యకర్తల అండ ఉన్నంతరకు విజయం మనదే అని పన్నీర్ సెల్వం అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+